ఈ మద్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనిషి భూమి పై బతకడం కష్టమే అన్న బ్రమ కలుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఓ వైపు ప్రకృతి మరోవైపు కాలుష్యం.. ఇక కొత్త కొత్త వైరస్ ఇవ్వన్నీ ఈ 2020 నే టార్గెట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. జూన్ 21, 2020న ప్రపంచం అంతంకానుందన్న వార్త గత కొన్ని నెలలుగా ప్రచారం కావడం, అదే రోజున అమావాస్య, సూర్యగ్రహణం రావడంతో నిజమేనేమోనని కొందరు ఆందోళనకు గురికాగా, ప్రపంచం నాశనం అవుతుందన్నది చివరికి ఉత్తుత్తిదని తేలిపోయింది. దీంతో మాయన్ క్యాలెండర్ మరోసారి మాయ చేసిందని ఇప్పుడు నెటిజన్లు అంటున్నారు. ఇదే విషయాన్ని రక రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఇక యుగాంతం కన్ఫామ్ అనుకున్నారు.
డూమ్స్ డే ప్రవచనాల మేరకు నిన్నటితో ప్రపంచం ముగుస్తుందని సిద్ధాంత కర్తలు అంచనా వేయగా, గతంలో మాదిరిగానే ఇది కూడా అబద్ధమేనని రుజువైంది. ఈ క్యాలెండర్ 1582లో ఉనికిలోకి వచ్చింది. అప్పట్లో ఈ క్యాలెండ్ర్ కి ఎంతో ప్రాధాన్యత ఉండేది. దాన్ని బట్టే ఈ క్యాలెండర్ పై చాలా మంది నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ క్యాలెండర్ మార్చిన సమయంలో 11 రోజులు పోయాయని, దాని ప్రకారం, ఇప్పుడు మనం 2020లో కాకుండా 2012లో ఉన్నట్టని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
గతంలో 2012 డిసెంబర్ 21న ప్రపంచం అంతమవుతుందని మాయన్ క్యాలెండర్ వెల్లడించగా, అది తప్పని తేలిపోయింది. అప్పటి ప్రజలు మయాన్, జూలియన్ క్యాలెండర్ లను అనుసరించగా, ప్రస్తుతం చాలామంది గ్రెగోరియన్ క్యాలెండర్ నే అనుసరిస్తున్నారు. ఓ హాలీవుడ్ చిత్రం '2012' కూడా నిర్మించబడి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి డూమ్స్ డే విషయంలో మాయన్ క్యాలెండర్ మరోసారి తప్పని రుజువైంది.