ఈ మధ్యకాలంలో ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్న సంఘటనలు ఎన్నో రోజూ చూస్తూనే ఉన్నాం. మహిళలు పై మాత్రమే కాకుండా అభంశుభం తెలియని పసి పిల్లలపై కూడా లైంగిక దాడులు చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. శిక్షలు ఎంత కఠినంగా వేసిన మనుషుల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఆ కామ మృగాలు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. బడికి వెళ్లి చదువుకునే పిల్లలను సైతం ఈ రాక్షస మృగాలు వదలడం లేదు.

 


అసలు విషయంలోకి వెళ్తే... పదకొండేళ్ల మైనర్ బాలికకు అశ్లీల వీడియోలు చూపించి ఆ పసి ప్రాణం పై పలుమార్లు ముగ్గురు స్కూల్ విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇకపోతే ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో చోటు చేసుకుంది. లైంగిక దాడి నేపథ్యం కింద పోలీసులు ఆ ముగ్గురు నిందితులలోని ఇద్దరిని అరెస్టు చేసి జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. మూడో వ్యక్తిని పట్టుకునే క్రమంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

 

 

సదరు బాలిక సుందరపురం ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. కొన్ని రోజుల క్రితం తన తల్లి చనిపోవడంతో తండ్రి, పిన్ని తో కలిసి జీవనం కొనసాగిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వారి ఇంటి ఓనర్ దగ్గరకు అప్పుడప్పుడు టీవీ చూడటానికి ఆ బాలిక వెళ్ళేది. అయితే ఆ ఇంటి ఓనర్ కు 16 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అతను ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతుండగా ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనుకునే వాడు అతడు. అయితే ఇటీవల కరోనా పుణ్యమా అని ప్రతి పాఠశాల ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ చేస్తున్న నేపథ్యంలో అతనికి ఓ మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చారు. ఓనర్ కొడుకు, అలాగే ఓ ఫ్రెండ్ కూడా వారి ఇంటికి వచ్చి చదువుకొని వెళ్తుండేవాడు. ఇకపోతే మే 20 న రోజులాగే ఆ అమ్మాయి టీవీ చూసేందుకు ఇంటి యజమాని ఇంట్లో కి వెళ్ళింది. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇద్దరు పిల్లలు మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తున్నట్టు గమనించింది. అయితే అక్కడి నుంచి వెళ్లి పోవడానికి ప్రయత్నం చేసినా ఆ ఇద్దరు బలవంతంగా ఆ బాలికకు అశ్లీల వీడియోలు చూపించి, ఆపై వారు అఘాయిత్యం తలపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: