దేశంలో కరోనా విజృంబిస్తున్నా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ గురించి అందరికి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తమమైన రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి. పీపీఎఫ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కచ్చితమైన రాబడి పొందొచ్చునని తెలిపారు. రిస్క్ ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుందన్నారు. అయితే తాజాగా పీపీఎఫ్ స్కీమ్‌లో చేరిన వారికి భారీ షాక్ తగిలే అవకాశముందని నిపుణులు అంటున్నారు.

 

 

అయితే మోదీ సర్కార్ ఇటీవలనే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించేసిన విషయం తెలిసిందే. దీంతో పీపీఎఫ్ వడ్డీ రేటు కూడా దిగొచ్చిందన్నారు. ఇప్పుడు పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉందన్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ వడ్డీ రేటు మరింత తగ్గే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. బాండ్ ఈల్డ్స్ క్రమంగా తగ్గుతూనే వస్తుండటం ఇందుకు ప్రధాన కారణంగా తెలియజేశారు.

 

 


ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి పీపీఎఫ్‌పై వడ్డీ రటును మరోసారి తగ్గించొచ్చనే అంచనాలు నెలకొన్నాయన్నారు. ఇదే జరిగితే అప్పుడు పీపీఎఫ్ వడ్డీ రేటు 7 శాతం దిగువకు పడిపోవచ్చునన్నారు. అప్పుడు 1974 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి అవుతుందన్నారు. అంటే వడ్డీ రేట్లు 46 ఏళ్ల కనిష్టానికి పతనమైనట్లు అవుతుందిని నిపుణులు తెలుపుతున్నారు.

 

 

స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు ప్రభుత్వపు బాండ్ ఈల్డ్స్‌తో అనుసంధానమై ఉంటాయని తెలియజేశారు. పీపీఎఫ్ వడ్డీ రేటు పదేళ్ల బాండ్ ఈల్డ్‌తో లింక్ అయ్యి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి పదేళ్ల బాండ్ ఈల్డ్ సగటున 6.07 శాతంగా ఉంటూ వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు ఇది 5.85 శాతానికి దిగొచ్చింది. అంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు మరోసారి తగ్గుతాయని అర్థం చేసుకోవచ్చు. ఇదే జరిగితే సామాన్యులకు మరో షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తూ వస్తున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: