భారతదేశంలో రోజురోజుకీ కరోనా ఎలాంటి తీవ్రరూపం దాలుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కర్ణాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను బులిటెన్ ద్వారా మీడియాకు తెలియ జేయడం జరిగింది. ఇకపోతే నేడు ఒక్కరోజే రాష్ట్రంలో 249 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9399 కి చేరుకుంది. మరోవైపు నేడు ఒక్కరోజే 111 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిస్చార్జ్ అవడం జరిగింది. దీంతో నేటి వరకు రాష్ట్రంలో 5730 మంది కరోనా వైరస్ నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.
Covid19 Bulletin: 22rd june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 22, 2020
Total Confirmed Cases: 9399
Deceased: 142
Recovered: 5730
New Cases: 249
Other information: Telemedicine facility, Corona watch application and Helpline details.1/2 pic.twitter.com/qui9BJyMsA
ఇక నేడు ఒక్కరోజే కరోనాకు ఐదుగురు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో నేటి వరకు 142 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 3523 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.
ఇందులో 80 మందికి సీరియస్ గా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చిన 11 మందికి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50 మందికి నేడు ఒక్కరోజే కరోనా పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది.