ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత స్థానంలో ఉండే వ్యక్తి విజయసాయిరెడ్డి. మొదటి నుంచి నెంబర్ టూ అంటూ విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత ఉంటూ వస్తోంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోను ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, జగన్ పక్కన విజయసాయి రెడ్డి ఉండాల్సిందే. విజయసాయి రెడ్డి కి తెలియకుండా ప్రభుత్వంలో గానీ, పార్టీలో కానీ, ఏ చిన్న వ్యవహారం జరగదు. ఇతర పార్టీల నుంచి నాయకులు చేరాలన్న, సొంత పార్టీలోని రెబల్ నాయకులను సస్పెండ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా.. విజయసాయి రెడ్డి అనుమతి కావాల్సిందే. పార్టీలో ఆయనకు అంతా ప్రాధాన్యం ఉంటూ వస్తోంది. అయితే విజయ సాయిరెడ్డి వ్యవహారం ఇప్పుడు వైసీపీలోనే కొంతమంది నేతలకు నచ్చడం లేదట. ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి చెందిన నాయకులు విజయసాయి రెడ్డి పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

IHG's Plans | Gulte - Latest Andhra ...


వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి, తమ ప్రాంతంలో పెత్తనం చేయడం ఏంటి అనేది వారి ఆగ్రహంగా కనిపిస్తోంది. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేయడంతో, కొంత మంది వైసీపీ నేతల కన్ను విశాఖ లోని విలువైన భూములపై పడిందట. గత టిడిపి ప్రభుత్వంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి .ఇప్పుడు వైసిపి నాయకులు కొంతమంది అదే విధంగా విశాఖను పరిపాలన రాజధాని గా ప్రకటించక ముందే తమకు చెప్పి ఉంటే, తాము ఆర్థికంగా లాభపడి ఉండేవారమనే బాధతో ఉన్నారు. ఇక టిడిపిలో భూ మాఫియా చేసిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు వైసీపీ నేతలకు దగ్గర అయ్యారట. 

 


ఏదో రకంగా విజయసాయి ని జగన్ కు దూరం చేస్తే విశాఖలో తమ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం లేకుండా సాధించుకోవచ్చు, భారీగా లబ్ధి పొందవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో, కొంత మంది వైసీపీ నాయకులు ఇప్పుడు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసుకుని జగన్ దగ్గర ఆయన పరపతిని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ సాయి రెడ్డి కొంతమంది అధికారులను అడ్డంపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ విషయం జగన్ వరకు వెళ్ళింది అని, పెద్ద ఎత్తున ప్రచారానికి దిగుతున్నారు. అక్కడితో ఆగకుండా ఇదే అంశాలపై సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టేస్తూ ఆయనను అభాసుపాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.


 ఇక విజయసాయి రెడ్డి అల్లుడు వ్యవహారాన్ని తెరమీదకు తీసుకు వచ్చినట్లుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. 108 అంబులెన్స్ కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారంలో ఆయన అల్లుడి కి లబ్ధి చేసే విధంగా అక్రమాలకు పాల్పడినట్లు గా జరుగుతున్న ప్రచారం వెనుక విశాఖ భూ మాఫియా ఉందనే విషయాన్ని ఇప్పుడు విజయసాయిరెడ్డి హైలెట్ చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: