ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రఘు రామ కృష్ణం రాజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ వస్తున్నాయి. రాజకీయంగా ఆయన చేసే వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఆయ‌న రాజ‌కీయంగా స‌రికొత్త దారులు ఎంచుకోనున్నార‌ని స‌మాచారం.

 

ఢిల్లీ పర్యటనకు వెళ్లి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో సమావేశం అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయ‌నే వార్తలు వైసీపీ క్యాంపుల నుంచే వస్తున్నాయి. ఈ నేపధ్యంలో రఘు జాగ్రత్త పడే ముందుగా త‌న‌కు ప్రాణ‌హానీ ఉందంటూ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు లేఖ రాసి మార్గం సుగుమం చేసుకున్నారని అంటున్నారు. ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి సైతం ఆయ‌న మ‌రో లేఖ రాసి మ‌రింత క‌ల‌క‌లం క్రియేట్ చేశారు.

 

ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తోన్న వారు త్వరలోనే ఆయన బిజెపి తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయన మీద అనేక ప్రచారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బిజెపిలోకి వెళ్ళే విషయంలో ఆయన తర్జన భర్జన పడుతున్నారు అని కూడా అంటున్నారు. మరి ఆయన‌ను వైసీపీ స‌స్పెండ్ చేస్తే పార్టీ మారతారా ?  లేదా ఒంటరిగా సభలో ఉంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: