డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఈ డబ్బు మనిషి సృష్టించాడు.. కానీ మనిషి జీవితంతో ఈ డబ్బు ఆడుకుంటుంది.  డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు డబ్బు కోసం కొంత మంది మనుషులు ఎంతటి నీచమైన పనులైనా చేస్తున్నారు.   కానీ నేరం ఎప్పటికీ పక్కలో బల్లెం లాంటిదే.. ఎప్పటికైనా గుచ్చుకుంటుంది.. నేరస్థులు పోలీసులకు చిక్కి తీరుతారు. తాజాగా ఓ భార్య తన భర్తకు  వచ్చే ఇన్స్ రెన్స్ డబ్బు కోసం ఘోరంగా పథకం పన్ని చంపించింది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఈ దారుణం జరిగింది. హతియతండాకు చెందిన బాదావత్‌ వీరన్న, యాకమ్మ దంపతులకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరన్న మద్యానికి బానిసయ్యాడు. తాగి వచ్చి భార్యా పిల్లలను వేధించేవాడు.

 

ఇక భర్త బాధలు భరించలేక అతని అడ్డు తొలగించాలని చూస్తున్నారు. అదే సమయంలో కుటుంబ పోషణ ఎలా అని ఆలోచించింది. దీంతో ఆరు నెలల క్రితం భర్త పేరుతో రూ.20 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. అనకున్న ప్రకారం శంకర తండాలో ఉండే తన అక్క బుజ్జి, బావ బిచ్యాకు యాకమ్మ ఈ విషయం చెప్పింది. వారంతా పక్కా ప్లాన్ తో వీరన్న చంపాలని స్కెచ్ వేశారు. ఈ నేపథ్యంలో యాకమ్మ బావ నెక్కొండ వెళ్లి వీరన్నకు పూటుగా మద్యం తాగించాడు. తర్వాత బైక్ మీద హతియాతండాకు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురూ కలిసి వీరన్నను పొలానికి తీసుకెళ్లి తాడుతో ఉరి వేసి చంపేశారు.

 

అంతే కాదు ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో కొట్టారు. ఆ తర్వాత కాల్వలో పడేశారు. గ్రామంలో తన భర్త కనిపించడం లేదని.. గిట్టని వారు హత్య చేసి ఉంటారని దొంగ ఏడుపు ఏడ్చింది. ఆ గ్రాస్థులు కలిసి వెతుకుతుండగా.. కాల్వలో వీరన్న మృతదేహం దొరికింది. దీంతో తన భర్తను ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె పై పోలీసులకు అనుమానం వచ్చి తమదైన స్టైల్లో అడగడంతో అసలు నిజం చెప్పింది.  ఇన్సురెన్స్ డబ్బు కోసం ఇదంతా చేశానని ఒప్పుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: