ఛీఛీ.. ఈ మధ్యకాలంలో జరిగే ఘటనలు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు అత్యంత దారుణమైన ఘటనలను చూడాల్సి వస్తుంది. ఒకడు కోడి కూరలో ఉప్పులేదు అని భార్యను చంపిన ఘటనను మనం ఇటీవలే చూశాం.. ఇప్పుడు అదే తరహాలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 

 

టీ లో పంచదార తక్కువ అయ్యింది అని ఓ కసాయి భర్త గర్భిణీ గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. కడుపుతో ఉందన్న కనీస కనికరం లేకుండా ఆ భర్త ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. ఒక్క స్పూన్ చక్కడ కోసం గొడవపడి ఆవేశంలో అతన్ని నమ్మి ఏడడుగులు వేసిన భార్య గొంతు కోసి చంపేశాడు. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాకు చెందిన బబ్లూ కుమార్‌ కి అదే ప్రాంతానికి చెందిన రేణు దేవి అనే మహిళతో 12 ఏళ్ళ కిందట వివాహం అయ్యింది. ఇంకా ఉదయమే నిద్రలేచిన భార్య భర్తకి టీ పెట్టి ఇచ్చింది. అయితే 'టీ'లో పంచదార తక్కువ అయ్యింది అని భర్త గొడవకు దిగాడు. 

 

ఇద్దరి మధ్య చిన్న గొడవ కాస్త పెద్ద గొడవగా మారింది. ఇంకా కోపంతో రగిలిపోయిన భర్త బబ్లు క్షణికావేశంలో భార్య గర్భవతి అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా పదునైన ఆయుదంతో గొంతు కోసి చంపేశాడు. అయితే తండ్రి కేకలకు పక్క రూమ్ లో పడుకున్న పిల్లలు నిద్ర లేచి చూసే సరికి రక్తపు మడుగులో కొట్టుకుంటున్న తల్లిని చూసి చిన్నారులు షాక్‌కి గురయ్యారు. ఇంకా భార్య గొంతుకోసిన భర్త అక్కడి నుండి పరారయ్యాడు. ఇంతలో భార్య ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: