కర్ణాటక రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా కర్ణాటక ఆరోగ్య శాఖ నేడు నమోదు అయినా కరోనా కేసులను మీడియా బులిటెన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 322 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బులిటెన్ ద్వారా తెలుస్తోంది. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9721 చేరుకుంది. ఇక ఈరోజు నమోదైన పాజిటివ్ కేసులలో 64 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివే. అలాగే విదేశాల నుండి వచ్చిన 5 మంది కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది.
Covid19 Bulletin: 23rd june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 23, 2020
Total Confirmed Cases: 9721
Deceased: 150
Recovered: 6004
New Cases: 322
Other information: Telemedicine facility, Corona watch application and Helpline details.1/2 pic.twitter.com/vkRfnT7HaD
ఇక గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 8 మంది మృతి చెందడం జరిగింది. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు 150 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ఈరోజు 274 మంది కరోనా వైరస్ బారినుండి పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దింతో రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6004 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రము లో 3563 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. ఇక ఇందులో 120 మందికి సిరీస్ గా ఉండడం తో ICU లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కేవలం బెంగళూరు నగరంలోనే 107 పాజిటివ్ కేసులు నేడు నమోదయ్యాయి. అలాగే బళ్లారి జిల్లాలో 53 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.