ఎంత దారుణం? ఎంత దారుణం? నాలుగు రోజుల కొందట ఓ భర్త భార్యను దారుణంగా చంపాడు.. ఆ కేసును చెందించిన పోలీసులకు కొన్ని షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి.. మరదలిపై మోజు.. భార్యపై అసహ్యమే ఈ దారుణానికి కారణం అయ్యింది అని వార్తలు తెరపైకి వచ్చాయి. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బేతంచెర్ల మండలం గోరుమానుకొండ తండాకు చెందిన సుశీలాబాయి అనే 26 ఏళ్ళ యువతికి అలేబాదుతండాకి చెందిన రవి నాయక్‌తో పెళ్లి అయ్యింది. అయితే భార్య పొట్టిగా ఉందని అసంతృప్తికి గురైన భర్త ఆమె చెల్లె ని ఇష్టపడ్డాడు. మరదలిపై ఉన్న ఇష్టంతో రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. 

 

ఇంకా ఈ విషయమై భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ జరిగాయి. దీంతో మరదలితో పెళ్లికి భార్య అడ్డుగా ఉంది అని ఆమెను అంతం చేయాలని నిర్ణయిం తీసుకున్నాడు. ఇంకా తన సమీప బంధువు రేఖా నాయక్‌తో కలసి హత్యకు ప్లాన్ చేసి ఆమె చావుకు ఎవరు కారణం కాదు అని భార్యతో ఆత్మహత్య లెటర్ రాయించాడు. 

 

IHG

 

ఇంకా ఆ లెటర్ ను ఇంట్లోనే ఉంచి.. గొర్రెలను మేపాలని కొండకి వెళ్దామంటూ భార్యని వెంట తీసుకెళ్లి బండరాయితో తలపై మోది అత్యంత దారుణంగా చంపేశాడు.. ఇంకా ఆమె శవాన్ని అక్కడే లోయలో పడేసి ఏమి తెలియని వాడిలా ఏడవడం ప్రారంభించాడు. అయితే ఆమె లెటర్ చూపించి ఆత్మహత్య చేసుకుంది అని నమ్మించే ప్రయత్నం చేశాడు. 

 

అయితే అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: