దేశంలో ఏమంట కరోనా వైరస్ మొదలైందో కానీ మనిషికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది.  మనిషిని మనిషి చూసి భయపడే పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు మన మద్య తిరిగినవారు.. క్వారంటైన్ కి వెళ్లే వరకు వారికి కరోనా ఉన్న విషయం తెలియడం లేదు. ఇలా ఎంతో మంది స్వేచ్చగా తిరుగుతున్నారు.. తర్వాత కరోనా లక్షణాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఫిబ్రవరిలో మొదలైన కరోనా కేసులు మార్చిలో పెరిగిపోవడంతో అప్పటి నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో లాక్ డౌన్ ప్రజల కష్టాలు మాములుగా లేవు.   కరోనాకు భయపడి ప్రజలు దాదాపుగా బయటకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా  అవసరమైన పని చూసుకొని వెళ్లిపోతున్నారు. 

 

ఈ మద్య లాక్ డౌన్ విషయంలో కొన్ని సడలింపులు తెచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేసులు మరిన్ని పెరిగిపోతున్నాయి. జనాలపై లాక్ డౌన్ ఎఫెక్ట్ బాగా పడింది.  గతంలో మాదిరిగా నాలుగు చోట్లకు తిరిగి కావాల్సినవి కొనుగోలు చేయడం లేదు.   పెద్ద పెద్ద వ్యాపార సంస్థలే మూతపడ్డాయి.  ఇక చిన్న చిన్న వ్యాపారుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  నిత్యవసర వస్తువులు, కూరగాయల కోసమే ప్రజలు బయటకు వస్తున్నారు.  కూరగాయల ధరలు కొన్ని చోట్ల కొండెక్కాయి. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఎక్కడున్నాయంటే వెంటే మహారాష్ట్ర అని చెప్పేస్తున్నారు.  మహారాష్ట్రలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ముంబై నగరంలో కరోనా కేసులు 70వేలకు పైగా ఉన్న సంగతి తెలిసిందే.  అక్కడ ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలన్నా భయపడుతున్నారు.   దీంతో ఓ కొత్తిమీర వ్యాపారి తన దగ్గర ఉన్న కొత్తిమీరను అమ్మెందుకు చీర్ డ్యాన్సర్ అవతారం ఎత్తాడు.  కొత్తిమీర కట్టను పట్టుకొని డ్యాన్స్ చేస్తూ అమ్మడం మొదలుపెట్టాడు.  ఐపీఎల్ మ్యాచ్ ల్లో చీర్ డ్యాన్స్ ను చూస్తుంటాం.  ఐపీఎల్ వాయిదా పడటంతో...రోడ్డుపై కొత్తిమీర వ్యాపారి చేసిన డ్యాన్స్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: