ప్రస్తుత రోజుల్లో మహిళలపై అఘాయిత్యాలు అతి దారుణంగా ఉంటున్నాయి. ఒకవైపు ప్రేమించలేదన్న కోపంతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉంటే మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఇక మరోవైపు ప్రేమ విఫలమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఈ సంఘటన ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఆ యువతి శవమై తేలడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన ఏర్పడింది.

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక బాలిక అదృశ్యమై ఉదంతం విషాదంగా మిగిలింది. కొత్తగూడ పట్టణం గంగాబిషన్‌ ప్రాంతానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంది. గత కొన్ని రోజులుగా అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఇక ఇటీవల వారు ఇద్దరు వీధి చివర మాట్లాడుకుంటూ ఉన్న సంఘటన బాలిక కుటుంబ సభ్యులు గమనించి యువతిని మందలించారు. దీనితో ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ బాలిక తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లారు. కానీ, అర్ధరాత్రి సమయంలో బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై చుట్టుపక్కల అంతా వెతికినా కూడా ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.

 


దీంతో బాలిక కుటుంబ సభ్యులు రాత్రికిరాత్రే కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. పోలీస్ అధికారులు యువకుడు గురించి వెతకగా అతడు కూడా కనిపించలేదని తెలుసుకున్నారు. ఈ తరుణంలోనే మరుసటి రోజు ఉదయం బాలిక మృతదేహం రైలు పట్టాలపై పడి ఉన్నట్లు పోలీస్ అధికారులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఇక బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతదేహం రెండు పట్టాల మధ్య పడి ఉండడం మాత్రమే కాకుండా ఒంటినిండా తీవ్ర గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు హత్య అనే అనుమానిస్తూ మరోసారి ఫిర్యాదు చేయగా... పోలీసులు మృతదేహాన్ని మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక అసలు సంఘటన ఏం జరిగిందన్న దానిపై స్పష్టత వస్తుందని పోలీస్ అధికారులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: