రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలుగు మీడియా సర్కిల్ లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా వైయస్ జగన్ కి వ్యతిరేకంగా ఉండే మీడియా వర్గాలు ఉండవల్లి చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా చిత్రీకరిస్తూ గత నాలుగు కథనాలు  మీద కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఓ రేంజ్ లో జగన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఉండవల్లి ఇవ్వటంతో తాజాగా పెట్టిన ఉండవల్లి మీడియా సమావేశానికి బాబోరు మీడియా బాగా ప్రాధాన్యత ఇచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి రహిత పాలన అందిస్తా అని మాట ఇచ్చారు తీరా చూస్తే కొత్త ఇళ్ల స్థలాల లో ఇసుక విషయంలో భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు.

 

ఈ విషయం గురించి ఆరా తీస్తే లెటర్ రాస్తే ఇప్పటివరకు ప్రభుత్వం నుండి స్పందన రాలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యవస్థలతో మరియు న్యాయస్థానాల తో ఢీ అంటే ఢీ అనేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని పూర్తిగా తప్పుపట్టడం జరిగింది. అధికారం లో ఉన్నవారు ఎవరైనా ప్రభుత్వ వ్యవస్థలలో గ్రిప్ పెంచుకోవాలని చూస్తారు, కానీ వైఎస్ జగన్ దానికి విరుద్ధంగా వాళ్లతో తగువులు గొడవలు పెట్టుకుని తనకు తానే డ్యామేజ్ చేసుకుంటున్నారు అన్న విధంగా ఉండవల్లి సీరియస్ అయ్యారు.

 

చాలా విషయాల గురించి మాట్లాడిన ఉండవల్లి కరోనా గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ మాస్క్ ధరించి వ్యవహరిస్తుంటే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పెట్టుకోకపోవడం ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉండవల్లి వేసిన పంచ అన్నిటికన్నా హైలెట్ గా పేలింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏపీ మీడియా సర్కిల్ లో ఉండవల్లి వేసిన ఈ పంచ్ వైరల్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: