దేశంలో కరోనా చాలా మందికి కడుపునిండా తిండిలేకుండా చేస్తుంది.. కొందరి జీవితాలైతే మరీ దుర్లభంగా మారిపోయి.. జీతాల్లో కోతలు, జీవితాల్లో కన్నీళ్లు కామన్ అయిపోయాయి.. ఇలాంటి పరిస్దితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.. అదేమంటే దేశ సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా వేతన పెంపు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్దితుల్లో ఈ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం సాహసంతో కూడుకున్నది కాబట్టి ఇక్కడ పనిచేసే వారి కుటుంబాలకు ఆసరగా ఉండేలా ఈ జీతాల పెంపును చేసిందని అధికారులు పేర్కొన్నారు..

 

 

ఇకపోతే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న లడఖ్‌ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులకు 100 నుంచి 170 శాతం వేతన పెంపును వర్తింపచేశారు.  చైనా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నెల కొంటున్న పరిస్దితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.. ఇక పెరిగిన ఈ వేతనాలు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని జాతీయ హైవేలు మౌలిక రంగ అభివృద్ధి కార్పొరేషన్‌ వెల్లడించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వంటి సాంకేతికేతర సిబ్బంది వేతనం ప్రస్తుతం నెలకు 16,770 ఉండగా 41,440 రూపాయలకు పెరిగింది.

 

 

ఇక ఢిల్లీలో ఇదే పోస్టులో పనిచేసే వ్యక్తి  28,000 రూపాయల జీతం అందుకోవడం గమనార్హం. కాగా లడఖ్‌ ప్రాంతంలో పనిచేసే అకౌంటెంట్‌ వేతనం తాజా పెంపుతో 47,360 రూపాయలకు పెరిగింది. ఇదే ప్రాంతంలో పనిచేసే సివిల్‌ ఇంజనీర్‌ వేతనం గతంలో 30,000 రూపాయలు కాగా ఇప్పుడది రెట్టింపై 60,000 రూపాలకు చేరింది. సీనియర్‌ మేనేజర్‌ వేతనం 55,000 రూపాయల నుంచి 1,23,600కు పెరిగింది. ఇవే కాకుండా వేతన ప్రయోజనాలతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగులకు సుమారుగా రూ పది లక్షల వరకు ప్రమాద బీమాను కల్పించడంతో పాటుగా వారికి టీఏ, డీఏ, పీఎఫ్‌ వంటి సదుపాయాలనూ వర్తింపచేస్తున్నామని అధికారులు తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: