అక్రమ సంబంధాలు పచ్చని సంసారాలను నాశనం చేసేస్తున్నాయి. క్షనికావేశం.. స్వల్ప కాలిక సుఖం కోసం ఎంతకు అయినా తెగించేస్తున్నారు. పరాయి పురుషుల మోజులో పడిన మహిళలు భర్తలను చంపేస్తున్నారు. అలాగే పరాయి మహిళల సుఖం మాయలో పడిన పురుషులు కూడా భార్యలను చంపేస్తున్నారు. దీని వల్ల అప్పటి వరకు సంతోషంగా ఉన్న బంధాలు నాశనం అవుతున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లలు అనాథలు అవుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే ఓ భార్యకు తన భర్త కంటే ప్రియుడే ఎక్కువ అయ్యాడు. ప్రియుడితో రాసలీలల నేపథ్యంలో ప్రశ్నించిన భర్తను అడ్డు తొలగించు కోవాలనుకుంది. ఈ క్రమంలోనే పక్కా స్కెచ్ వేసి భర్తను చంపేసింది.
ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు ఏజెన్సీలోని రంపచోడవరం నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలం కూడురులో భవానీ, సోమిరెడ్డి దంపతులు ఉంటున్నారు. వీరికి పెళ్లయ్యి పదేళ్లు అవుతోంది. భవానీ అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణతో కొద్ది రోజులుగా అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త కళ్లుగప్పి ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తోంది. కొద్ది రోజులకు భర్త సోమిరెడ్డికి అనుమానం రావడంతో ప్రశ్నించాడు. దీంతో భవానీ తన రాసలీలలకు భర్త ఎప్పటకీ అయినా అడ్డు వస్తాడని భర్తను వదిలి సూర్యనారాయణ ఇంటికి వెళ్లిపోయింది. ఆమెను అనుసరిస్తూ సోమిరెడ్డి కూడా వెళ్లాడు.
అక్కడ భార్య, భర్తలతో పాటు ప్రియుడి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భవానీ, సూర్యనారాయణ కలిసి సోమిరెడ్డిని చంపేశారు. దగ్గర్లోనే ఉన్న అటవీ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత వారు భవానీ తన భర్త కనిపించడం లేదని స్తానికులకు చెప్పింది. పోలీసులు భవానీపై అనుమానంతో ఉండగా.. ఆమె అప్పటికే ప్రియుడు సూర్యనారాయణతో కలిసి లేచిపోయింది. పోలీసులు వీరి కోసం విచారిస్తున్నారు.