ఎప్పుడూ తమ రాజకీయ ప్రత్యర్థులపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తూ, వారిని ఆటపట్టిస్తూ వచ్చే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. గత కొద్దిరోజులుగా అదేపనిగా లోకేష్ వైసిపి నాయకులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూ ఉండటం, ఈ విమర్శలు  శృతిమించడంతో  విజయసాయి రెడ్డి మరోసారి రంగంలోకి దిగారు. లోకేష్ చేస్తున్న విమర్శలకు ఉంటారుగా వ్యంగ్యంగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా పడ్డారు. 


 లోకేష్ సొంత పెళ్ళానికి వాట్సప్  మెసేజ్ పెట్టాలంటే జగన్ గారి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అంటున్నావా ? అవునా దానికి జగన్ పర్మిషన్ తీసుకుంటున్నావా ? ఎందుకయ్యా లోకేష్ ? రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేత గాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్ ? అంటూ విజయసాయిరెడ్డి  వ్యాఖ్యానించారు.

 


 ఇక మరో ట్వీట్ లో మా మాలోకం కళ్లు ఎప్పుడూ ఇసుక మీదే ఉంటాయి. అప్పట్లో ఇసుక మాఫియా నుంచి ప్రతి నెలా మామూళ్లు అందుకునే వాడివని,  ఇప్పుడు ఆగిపోయిందని నీ ఏడుపా అంటూ విమర్శించారు. హైదరాబాద్ లో కూర్చుని కూర్చుని ఉచిత సలహాలు ఇవ్వడం కాదని, ఇక్కడికి వచ్చే సమస్యలను అధ్యయనం చేసి మాట్లాడాలని ,  ఎక్కడో ఎప్పుడో జరిగిన సంఘటన  చూపించి ఇలాగే జరుగుతోందని అంటే ఎలా చిట్టి నాయుడు అంటూ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: