ప్రభాస్ ఓ సినీ స్టార్.. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన క్రేజ్ భారీగా పెరిగింది. ప్రభాస్ సినీ స్టార్ అయితే జగన్ పొలిటికల్ స్టార్.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. చంద్రబాబు వంటి చాణక్యుడిని ఎదుర్కొన్ని 175 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 151 సీట్లు గెలుచుకున్నాడు. తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు.

 

 

అయితే ఇప్పుడు వీరిద్దరినీ పోలుస్తున్నాడో వైసీపీ మంత్రి.. ప్రభాస్ సినీ బాహుబలి అయితే.. జగన్ నిజమైన బాహుబలి అంటూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోల్చి చెప్పారు. వాస్తవానికి నిలువుగా, అడ్డంగా పెరిగితే బాహుబలి కాదని.. ప్రజల సమస్యలను పరిష్కరించే సీఎం వైఎస్‌ జగన్ నిజమైన బాహుబలి అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు.

 

 

జగన్ ను బాహుబలితో పోల్చి ఊరుకోలేదా మినిస్టర్.. టీడీపీ నేతలను కాలకేయుల్లా పోల్చేశారు. "టిడిపి వారు కాలకేయుల్లాంటోళ్లు.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పడిపోయింది. వైఎస్‌ రాజారెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఉందా..” అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.

 

 

అంతే కాదు.. మాట్లాడితే అచ్చెన్నాయుడిని హత్య చేయాలని ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు.. అసలు హత్యలు చేసే సంస్కృతి టీడీపీది. వంగవీటి రంగను నడిరోడ్డుపై చంపించింది ఎవరు? టీడీపీ అధికారంలో ఉన్నపుడే వంగవీటి రంగను హత్య చేయించలేదా..? హత్యా రాజకీయాలకు పేరు ప్రఖ్యాతులు గడిచింది నారా చంద్రబాబు అంటూ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏదేమైనా ప్రభాస్ తో జగన్ పోలిక భలే ఇంట్రస్టింగ్ గా ఉంది కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: