తమిళనాడులోని ట్యూటికోరిన్ లో జరిగిన తండ్రి- కొడుకుల లాకప్ డెత్  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈఘటన పై సినీ సెలబ్రెటీలు కూడా  ట్వీట్ ల రూపంలో స్పందిస్తున్నారు. అందులో భాగంగా  ఈఘటనకు భాద్యులైన వారిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రముఖ హీరోయిన్ ,తమ్మన్నా ట్వీట్ చేసింది. 
ఇక ఇంతకీ లాకప్ డెత్ ఎందుకు జరిగిందంటే..  ట్యూటికోరిన్ లో జయరాజ్ అతని కొడుకు ఫినిక్స్ ఓసెల్ షాప్ నిర్వహిస్తున్నారు అయితే  కరోనా వల్ల ప్రస్తుతం లాక్ డౌన్ అమలువుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ సమయంలో షాప్ తెరిచివుంచారు. అప్పటికే పాట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అక్కడి చేరుకోని జయరాజ్ , ఫినిక్స్ లపై దుర్భాషలాడారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ లో భాగంగా ఇద్దరిని దారుణంగా హింసించి రక్తాలు వచ్చేలా కొట్టారు ఆ దెబ్బలకు తాలలేక ఇద్దరు స్టేషన్ లోనే ప్రాణాలు విడిచారు. దాంతో ఈ ఘటనకు బాద్యులైన వారిఫై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి అయినా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు లాకప్ డెత్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: