వ్యాక్సిన్ లేని కరోనా వైరస్ బారిన పడకూడదంటే ఉన్న ఏకైక మార్గం జాగ్రత్తలు పాటించడం. ఇందులో భాగంగా మాస్కులు, శానిటైజర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే చేతులు శుభ్రపరుచుకున్నా.. ఎప్పటికప్పుడు ముట్టుకునే వస్తువులను శుభ్రం చేసుకోవడం ఎలా? తరచూ వాడే ఫోన్, వాచ్, రింగ్ వంటి వాటిపై వైరస్ ఉంటే గుర్తించడమెలా ..? వైరస్ చెక్క, స్టీల్ వంటి ప్రదేశాలపై ఎక్కువ సమయం ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించారు. అందుకే సబ్బు, నీళ్లు, ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ సాయంతో వైరస్ను కడిగేసే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. అయితే గ్యాడ్జెట్లను శుభ్రం చేయడానికి అవి పనిచేయవు. అందుకే వాటి కోసం ప్రత్యేకమైన శానిటైజర్ పరికరాలు తయారు చేస్తున్నాయి సంస్థలు.
యూవీ లైట్(అతినీలలోహిత కిరణాలు) సాయంతో గ్యాడ్జెట్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. క్రిములు, బాక్టీరియా, వైరస్ చంపడంలో ఇవి బాగా తోడ్పడతాయి. ప్రతిరోజు వాడే వస్తువులను శుభ్రం చేసుకునేందుకు ఉన్న సాధనం యూవీ-సీ పాకెట్ స్టెరిలైజర్. దీని ధర రూ.2,199. దీనితో దాదాపు 99.9 శాతం క్రిములను చంపేయొచ్చట. అదీ 10 సెకన్ల నుంచి 3 నిమిషాల్లోనే! వస్తు పరిమాణంపై ఆ సమయం ఆధారపడి ఉంటుంది. ఈ పరికరంలో యూవీ-సీ లైట్, సెన్సార్లు, వర్క్ ల్యాంప్, ఎలక్ట్రిక్ ల్యాంప్, యూవీ-సీ ల్యాంప్ వంటి భాగాలు ఉంటాయి.
దీనికి 400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 100 నిమిషాల బ్యాటరీ స్టాండ్బై లైఫ్ ఉంటుంది. ఇందులోని ఎల్ఈడీ దాదాపు 5 వేల నుంచి 10 వేల గంటల వరకు పనిచేస్తుంది. దీన్ని డైలీ ఆబ్జక్ట్స్ అనే సంస్థ తయారు చేస్తోంది. ఇది పాకెట్లో పట్టే పరిమాణంలో ఉండే డిస్ప్లే క్లీనర్. దీని సాయంతో ల్యాప్టాప్ స్క్రీన్లు, ట్యాబ్లు, మొబైళ్లు శుభ్రం చేసుకోవచ్చు. దీనికి చిన్నపాటి స్ప్రే, మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటాయి. స్ప్రే సాయంతో శుభ్రం చేసే ద్రవాన్ని స్క్రీన్పై చిమ్మి.. ఇచ్చిన ఫైబర్ క్లాత్తో శుభ్రం చేసుకోవాలి. దీని ధర రూ.249 మాత్రమే.