కేరళలో ఇప్పటివరకు ఆదివారాల్లో మాత్రం పూర్తి లాక్ డౌన్ అమల్లోకి రాగ రేపటి నుండి మాత్రం లాక్ డౌన్ ను  ఉపసంహరిస్తున్నామని కేరళ ప్రభుత్వం తెలియజేసింది అయితే ఆదివారాల్లో లాక్ డౌన్ ఉండకున్నామిగితా రోజుల్లో లాగే రాత్రి 9గంటల నుండి  ఉదయం 5గంటల వరకు  కర్ఫ్యూ కొనసాగనుంది. మరోవైపు రాష్ట్రంలో  భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి గత ఎనిమిది రోజుల నుండి ప్రతి రోజు కేసుల సంఖ్య 100 దాటగా ఈరోజు ఏకంగా రికార్డు స్థాయిలో 195 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. సింగిల్ డేలో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 4071కేసులు నమోదుకాగా అందులో 1939కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 2108మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 22 మంది మరణించారు.
ఇక మిగితా రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర లో అత్యధికంగా 5318 , ఢిల్లీ లో 2948, తమిళనాడు లో 3713 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 520000 దాటగా 16000 మరణాలు చోటు చేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: