11 ఏళ్ళ క్రితం పేరు ఒక సంచలనం. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరుమోసిన నేరస్తుడు సైనైడ్ మోహన్ పేరు చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. ఇతను దాదాపు 20 మంది యువతుల మరణానికి కారణమైన మానవ మృగం. సైనేడ్ మోహన్ కేసులో తాజాగా మంగళూరు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అయితే పలు కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలిన మోహన్ పై తాజాగా మరొకటి శిక్ష పడింది.

 

సీరియల్ కిల్లర్ 2009లో కేరళ మహిళపై లైంగిక దాడి చేసిన అనంతరం ఆమెను చంపివేయగా కేసులో ఇతనిని కోర్టు దోషిగా నిర్ధారించింది. 57ఏళ్ల మోహన్ గతంలో మరో 19 మంది మహిళలపై లైంగిక దాడి చేసినట్లు ఆధారాలతో సహా దోషిగా తేలాడు. ఇక ప్రస్తుత కేసు విషయానికి వస్తే మోహన్ కాసర్ గోడ్ కు చెందిన 25 ఏళ్ల మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి బెంగళూరుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్ లో బస చేసి తర్వాత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 

అనంతరం ఆమె గర్భం దాల్చగాగర్భనిరోధక మాత్ర అంటూ ప్రాణాంతకమైన సైనైడ్ పూసిన మాత్రను మింగించడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇక మోహన్ ఇదే తరహాలో 20 సందర్భాల్లోనూ సైనైడ్ ప్రయోగించి మహిళలను చంపినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఒక కేసులో చిక్కిన మోహన్ గురించి విచారణ చేస్తుండగా ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మంది అమ్మాయిలను మోసం చేసి ఇలాగే చంపినట్లు మోహన్ అంగీకరించాడు.

 

ఇక మిగిలిన కేసులకు సంబంధించి ఇప్పటికే మోహన్ కు వివిధ న్యాయస్థానాలు ఐదు మరణ శిక్షలు జీవితకాల శిక్షలు విధించాయి. వీటిలో రెండు మరణ శిక్షలను జీవిత ఖైదుగా మార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: