దేశంలో కరోనా మహమ్మారితో ప్రజలు ఎంత హింసపడుతున్నారో తెలిసిందే. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఇక దేశం ఎంత అభివృద్ది చెందుతుంది.. టెక్నాలజీ రంగంలో అగ్ర దేశాలతో పోటీ పడి ముందుకు సాగుతున్నాం. కానీ మూఢ నమ్మకాలు... మత, కుల విశ్వాసాలు మాత్రం మానడం లేదు. ఇప్పటికీ కుల వ్యవస్థపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తమ కులం కాదని అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వివాహం చేసుకున్నా.. ప్రేమించినా వారిని దారుణంగా హతమార్చుతున్నారు. ఇలాంటి వాటిపై ఎన్నో సినిమాలు వచ్చినా ప్రజల్లో మార్పు రావడం లేదు. దేశంలో ఎక్కడోచోట కులహత్యలు జరుగుతూనే ఉన్నాయి. కులాన్ని పట్టుకు వేలాడుతున్నవారు ఉన్మాదులుగా మారి దారుణాలకు పాల్పడుతున్నారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కుల వివక్షత ఘోరంగా ఉంటుంది.
తాజాగా ఓ ఉన్మాది తన చెల్లెలు వేరే మతం వాడిని ప్రేమించిందని ఆమెను హత్య చేశాడు. అత్యంత నిర్దయగా చెల్లెలి మృతదేహాన్ని బంజరు భూమిలో పారేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ధామాగావో దెగ్లూర్ తాలూకాలో చోటు చేసుకుంది. కల్పనా సూర్యవంశీ అనే మైనర్ బాలిక ఓరోజు అదృశ్యమైంది. ఆ తర్వాత పోలీసు కేసు కావడంతో ఆమె గురించి వెతకడం ప్రారంభించారు.. జూన్ 22న ఆమె శవమై తేలింది. అయితే శవం అత్యంత దారుణమైన స్థితిలో ఉండగా పోలీసులు రికవరీ చేసుకున్నారు. ఆ మృతదేహం దారుణమైన పరిస్థితిలో కనిపించింది.. నక్కలు సగం తినేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ హత్యపై పోలీసులకు అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ యువతిని ప్రేమించినవాడే హత్యచేశాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. కాకపోతే ఆమె అదృశ్యం అయిన వెంటనే ఎందుకు కేసు పెట్టలేదన్న అనుమానాలు రావడంతో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేశారు. చుట్టు పక్కల వారిని విచారించారు.. దాంతో అసలు విషయం బయట పడింది. మృతురాలి అన్న అనిల్ సూర్యవంశీ(26)ని పట్టుకుని విచారించగా అతను నేరం ఒప్పుకున్నాడు.కాగా, జూన్ 30 వరకు నిందితుడిని రిమాండులో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.