ప్రేమ గుడ్డిది.. అవును ప్రేమలో ఉన్నవారు నా.. నీ అని చూడరు. అయితే ఇప్పుడు లింగ బేదాలు కూడా చూడకుండా ప్రేమికులు పిచ్చి పనులు చేస్తున్నారు. ఆడవారిని ఆడవారు ఇష్టపడటమే కాదు.. పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇక వారి ప్రేమ వివాహాలను పెద్దలు ఒప్పుకోరనీ.. అందునా తమది ఇంకా డిఫరెంట్ పెళ్లి అని వారు భావించారు. దీంతో ఇద్దరూ ఇంట్లో చెప్పా పెట్టకుండా టపా కట్టారు.  పెద్దలు పోలీసులను ఆశ్రయించడంతో వారిని పట్టుకున్నారు. వారిద్దరి యవ్వారం తెలిసి పెద్దలంతా షాక్‌తో నోళ్లు వెళ్లబెట్టారు. బుధే బాలాజీ ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలిక(17) సోమవారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు ఊరూవాడా అంతా వెదికారు.  దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

ఈ క్రమంలో శివ్‌పురి జిల్లాకు చెందిన మైనర్‌ బంధువైన మహిళ కూడా కనిపించటం లేదని విచారణలో తేలింది. దీంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు కలిగాయి.   అయితే ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని.. చంపి ఉంటారని భయపడ్డారు.  శుక్రవారం పక్కా సమాచారంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని కిడ్నాప్ చేసింది ఏ దుండగుడో కాదని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.

 

శివపురి జిల్లాకు చెందిన మహిళ, మైనర్‌ను లేవదీసుకుపోయి వివాహం చేసుకున్నట్లు తెలియగానే పోలీసులు సహా, ఇద్దరి తల్లిదండ్రులు షాకయ్యారు.  అయితే ఈ విషయం ఊరిలో తెలిసి ఆ టీచర్ ని నిలదీశారు. ఇలా చేయడం వల్ల ఏం సందేశం ఇవ్వాలని చూస్తున్నారని అందరూ తల ఒక మాట అన్నారు. బాలిక ఇష్ట ప్రకారమే తన వెంట వచ్చిందని, తాను ఎటువంటి బలవంతం చేయలేదని సదరు మహిళ తెలిపింది. కాగా, మైనర్ బాలికను తీసుకువెళ్లిన క్రమంలో సంబంధిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: