గత కొంత కాలంగా దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే.. ముందు నుంచి మనం ఓ ప్రణాళిక ప్రకారం కరోనాని కట్టడి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాం.. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ పాటించి ప్రతి భారతీయుడు కరోనాపై యుద్ధం చేశారని అన్నారు  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.  భారత్ ఇప్పుడు రెండు యుద్ధాలు చేస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండు యుద్ధాల్లోనూ మనమే ఘన విజయం సాధించనున్నామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. 

 

ఓ న్యూస్ ఏజన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, దేశంలో కరోనాతో, సరిహద్దుల్లో చైనాతో ఇండియా యుద్ధం చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు కరోనాపై సమర్థవంతంగా విజయం సాధిస్తూ వచ్చాం.. ఇతర దేశాలతో పోల్చితే కరోనా రికవరీ శాతం మనం మంచి పొజీషన్లో ఉన్నామన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇక చైనాను సమర్థవంతంగా ఎదుర్కొంటామని వారు ఎలాంటి కుట్రలు పన్నినా వాటిని తిప్పి కొడతమాని అన్నారు.

 

చైనాతో నెలకొన్న విభేదాలపై ఎవరు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలు నమ్మబోరని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఈ విషయంలో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని అమిత్ షా హితవు పలికారు. భారత సైనికులు అత్యంత వీరోచితంగా పోరాడుతున్నారని, ఇటువంటి సమయంలో చైనా, పాక్ లకు లాభం చేకూర్చేలా వ్యాఖ్యలు చేయడం ఏంటని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.  కరోనా కట్టడి విషయంలో ఢిల్లీ ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోందని, ప్రభుత్వానికి కేంద్రం నుంచి తగు సహాయ, సహకారాలను అందిస్తామని ఆయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: