దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దింతో లాక్ డౌన్ విధించినప్పటికీ ఎం మార్పు లేదు. అయితే లాక్ డౌన్ లో సడలింపులు రావటంతో ప్రయాణాలు ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. ఇండియన్ రైల్వేస్ తాజాగా ట్రైన్ జర్నీ చేసే వారికి ప్రయోజనం కలిగేలా ఒక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో తత్కాల్ టికెట్ బుకింగ్ సర్వీసులు నిలిపివేసిన రైల్వేస్ ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసులను ప్రారంభించిందని సమాచారం. అన్ని స్పెషల్ ట్రైన్స్‌కు ఇది వర్తిస్తుంది.

 

 

ప్రయాణికులు ఈరోజు నుంచే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చుని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలను సెంట్రల్ రైల్వేస్ పీఆర్‌వో శివాజీ సుతార్ ఈ విషయాన్ని వెల్లడించారు. తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ సర్వీసులు 200 శ్రామిక్ ట్రైన్స్‌ను అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే అన్ని రాజధాని రైళ్లకు కూడా ఇది వర్తిస్తుందని వివరించారు.

 

 

ట్రైన్ చేయాలని భావించే వారు ఏసీ ట్రైన్స్‌కు తత్కాల్ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపారు. అదే స్లీపర్ క్లాస్ టికెట్లు అయితే 11 గంటల నుంచి బుక్ చేసుకోవలసి ఉంటుందన్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉందన్నారు. ప్రయాణానికి 120 రోజులు ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

 

 

అంతే కాకుండా ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఏసీ క్లాస్‌లో ప్రయాణించే వారికి ఫ్రెష్ ఎయిర్ అందించేందుకు సిద్ధమైందన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్ పంప్స్‌ను సెట్ చేస్తోందని తెలిపారు. తొలిగా 30 ట్రైన్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కోచ్‌లో గాలి గంటకు 16 నుంచి 18 సార్లు మారుతూ వస్తుందని సమాచారం. పాత గాలి స్థానంలోకి కొత్త గాలి వచ్చి చేరుతుంది. ఇది వరకు అయితే 6-8 సార్లు మాత్రమే కోచ్‌లో గాలిని మార్చేవారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: