ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి క్షణిక ఆవేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నేటి యువత. ఒక యువకుడు అందంగా లేనని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. తన ముఖం పై మొటిమలు, మచ్చలు ఉన్నాయని మనస్థాపానికి గురై ఒక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా మాణిక్యపురం లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. 

IHG's Greater Noida

 


పోలీస్ అధికారులకు మృతుడి తల్లి పద్మనాయక ఇచ్చిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన సునీల్ నాయక్ చిన్న వయసులో నుంచి తన ముఖం పై మచ్చలు ఉండేవి. తన చిన్న వయసు నుంచే కాలేజీకి వెళ్లడం ప్రారంభించాక ముఖంపై మచ్చలు ఉంటాయని భావించే వాడని తల్లి తెలియజేసింది. అంతే కాకుండా ఎప్పుడూ కూడా ముఖంపై గుడ్డ కట్టుకుని తిరిగేవాడు. చాలా మంది వైద్యుల వద్ద వెళ్లి మందులు వాడినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా తన కొడుకు ని చులకనగా చూస్తారనే తీవ్ర మానసిక సంక్షోభానికి గురయ్యేవాడని తెలియజేసింది.

 

IHG'harassment ...


ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, మృతుడి తల్లి పోలీస్ అధికారులకు తెలియజేసింది. ఇక సంఘటనపై కవిటి ఎస్ఐ కె. వాసు నారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. ఇక మృతదేహాన్ని పోలీస్ అధికారులు సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఇక సంఘటన విషయం తెలుసుకున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ, డాక్టర్ లీల మృతదేహానికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించాలని స్థానిక డాక్టర్లకు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: