భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం   గచ్చిబౌలీ లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS), గాంధీ ఆసుపత్రి, దోమల్ గూడాలోని దోభీ గల్లీ (కంటేన్ మెంట్ ఏరియాను) సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరీశిలించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, సీనియర్ ఆధికారులతో సమావేశమై కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాలసిన చర్యల పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై వైద్య శాఖ అధికారులు డిటేల్డ్ ప్రజెంటేషన్ ను ఇచ్చారు.

 

రాష్ట్రంలో సర్వైలెన్స్ , కంటేన్ మెంట్ చర్యలు , ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్ నివారణ చర్యల పై కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని తెలిపారు. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేసింది మరియు ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని పంచుకుంది. కేంద్ర బృందం రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు , వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం , కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు క్లినికల్ మెనేజ్ మెంట్ పై సూచనలు చేసింది.

 

 కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, కేంద్ర టీం సభ్యులు శ్రీ సంజయ్ జాజు, శ్రీ లవ్ అగర్వాల్ , డా. రవీంద్రన్, అరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డా. యోగితా రాణా,  జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ అమయ్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: