దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఈ కష్టకాలంలో బ్యాంకులు కొత్త స్కీమ్ లతో ప్రజల ముందుకు వస్తుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఈకామర్స్ పోర్టల్‌ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలు తయారు చేసే ప్రొడక్టుల విక్రయానికి ఈ పోర్టల్‌ను అందుబాటులో ఉంచుతామని ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ తెలిపారు. దీని పేరు భారత్ క్రాఫ్ట్. బ్యాంకు, ప్రభుత్వం రెండూ కలిసి ఈ పోర్టల్‌ను నిర్వహిస్తున్నామన్నారు.

 

 

అయితే ఇప్పటికే పని జరుగుతోంది. పోర్టల్‌కు సంబంధించి నమూన ఏర్పాటైందని తెలియజేశారు. ఫ్లాట్‌ఫామ్ రూపకల్పన పనులు త్వరలోనే ప్రారంభమౌతాయని రజ్‌నీష్ కుమార్ తెలియజేశారు. సీఐఐ నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అంతే కాక ఎంఎస్ఎంఈ మినిస్టర్ నితిన్ గడ్కరి కూడా ఈ పోర్టల్‌ గురించి గతంలో తెలియజేశారని తెలిపారు.

 

 

అయితే కొత్త ఈకామర్స్ పోర్టల్ ఎప్పటి నుంచి అందుబాటులోక వస్తుందో రజ్‌నీష్ కుమార్ తెలియజేయడాం లేదన్నారు. ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం కలుగనుందన్నారు. వారి ప్రొడక్టులకు వారే సొంతంగా పోర్టల్‌లో విక్రయించుకోవడానికి వీలవుతుంది. దేశవ్యాప్తంగా మార్కెట్ అందుబాటులోకి వస్తుంది.

 

 

ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి చాలా చర్యలు తీసుకుంటూ వస్తోందని యాజమాన్యం తెలియజేశారు. వీటిల్లో సులభంగా రుణాలు అందిచడం కూడా ఒకటి. ఎస్‌బీఐ 4 లక్షల అకౌంట్లకు పైగా రుణాలు అందించిందని తెలిపారు. రూ.3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కింద ఈ తరహా రుణాలు ఆఫర్ చేసిందన్నారు. ఈ స్కీమ్ జూన్ 1 నుంచి అమలులోకి వచ్చిందని తెలియజేశారు. బ్యాంక్ ఈ పథకం కింద దాదాపు రూ.20 వేల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: