ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మామూలుగా అయితే భారత్ ఇతర దేశాలతో యుద్ధం చేసినప్పుడు కేవలం ఆయుధాలతో మాత్రమే యుద్ధం చేసింది. కానీ చైనా తో మాత్రం ఫిజికల్గా మాత్రమే ఇప్పటివరకు యుద్ధం చేసింది భారత్. అటు చైనా సైనికులు కూడా ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే భారత్పై ఫిజికల్ యుద్ధానికి దిగుతున్నాయి తప్ప ఆయుధాలను మాత్రం ఉపయోగించడం లేదు. అదే సమయంలో భారత్ కూడా చైనాకు ఫిజికల్ గానే మంచి బుద్ధి చెబుతుంది,
అయితే ఇటీవలే భారత్-చైనా సరిహద్దు లో 20 మంది భారత సైనికులు అమరులుఅయిన విషయం సంచలనంగా మారింది కూడా అందుకే. మామూలుగా ఇరు దేశాల మధ్య కాల్పులు జరిగి సైనికులు అమరులు అయితే ఒక లాగా ఉండేది.. కానీ ఒక్క గుండు కూడా పేలకుండా కనీసం తుపాకీ ఉపయోగించకుండా కేవలం ఫిజికల్ దాడితోనే 20 మంది భారత సైనికులు చనిపోవటం సంచలనంగా మారిపోయింది. అయితే ఊరికే ఫిజికల్ దాడికి దిగుతున్న చైనాకు గట్టి బుద్ధి చెప్పేందుకు రోజురోజుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే మొన్నటి ఘర్షణలో భారత సైన్యానికి సంబంధించిన ఘాతుక్ టీమ్ చైనా సైనికుల పీకలు వీరి చేసిన విషయం తెలిసిందే. దీంతో చైనా సైనికులు ఘాతుక్ టీమ్ ని చూసి వణికి పోతున్నారు . హరహర మహాదేవ్ అంటూ గట్టిగా నినదిస్తూ మీద పడిపోయే ఘాతుక్ పమాటేం అంటే వణికిపోతున్నారు. ఇక భారత్ అక్కడితో వదిలేయకుండా భారత దేశ వ్యాప్తం గా ఎక్కడై తే అదనంగా ఘాతుక్ టీమ్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ చైనా భారత్ సరిహద్దు ప్రాంతానికి రప్పించింది. దీంతో చైనా సైన్యం లో మరింత వణుకు పుట్టింది అంటున్నారు విశ్లేషకులు.