విజయవాడలో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు.  108, 104 నూతన వాహనాల ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ఆయన తెలిపారు.  ఈ క్రమంలో చెన్నై నుంచి విశాఖపట్నంకు వెళ్లే వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగుంట ద్వారా.. విశాఖపట్టణం నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ ద్వారా మళ్లింపులు చేస్తామని ఆయన వెల్లడించారు.   విజయవాడ నగరంలోనూ దారి మళ్లింపులు ఉంటాయని శ్రీనివాసులు అన్నారు.

 

ఇక గుంటూరు నుంచి ఏలూరు వెళ్లే వాహనాలు వారది మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి విజయవాడలోకి అనుమతి ని ఇస్తామని ఆయన పేర్కొన్నారు.  అలాగే ఏలూరు నుంచి గుంటూరు వెళ్లే వాహనలు గురునానాక్ కాలనీ నుంచి మళ్లిస్తామన్నారు.  వీటితో పాటు మచిలీపట్నం నుంచి గుంటూరు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ సర్కిల్.. మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే వాహనాలు ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు నుంచి మళ్లిస్తామని తెలిపారు. 

 

ఇక ఏలూరు నుంచి విజయవాడ వచ్చే బస్సులు రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు రోడ్డు వైపు..  మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ వచ్చే బస్సులు తాడిగడప నుంచి మళ్లింపు ఉంటాయని అన్నారు. ఇదిలా ఉంటే ప్రజాపతినిధులు, ముఖ్య అతిధులు..జాతీయ రహదారి , పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డు , రూట్ నెంబర్-5, ఏలూరు రోడ్డు, మచిలీపట్నం రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్‌కి బెంజ్ సర్కిల్‌కి చేరుకోవాలని శ్రీనివాసులు సూచించారు. ట్రాఫిక్ వాహన మళ్లింపుకు ప్రజలు సహకరించాలని శ్రీనివాసులు ఈ సందర్భంగా విఙ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: