భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్ పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను జత చేసి నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం లోడుతో ఉన్న మూడు రైళ్లను జత కలిపి బిలాస్ పూర్-చక్రధర్ పూర్ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు పేర్కొంది. మూడు గూడ్స్ రైళ్లను జతచేసి ఒకే సర్వీసుగా విజయవంతంగా నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది ఆగ్నేయ మధ్య రైల్వే.
మొత్తం 177 బోగీలు, 15 వేల టన్నుల సరుకుతో ఉన్న ఈ రైలును బిలాస్పుర్- చక్రధర్పుర్ డివిజన్ల మధ్య నడిపారు. ఇటీవల రైల్వే మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గుతోపాటు ఇతర నిత్యవసర సామాగ్రిని తరలించడంపై రైల్వే శాఖ దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ నేపథ్యంలో 15 వేల టన్నులకు పైగా సరకుతో ఉన్న మూడు రైళ్లను వేగంగా నడుపుతూ... సూపర్ అనకొండ అని హ్యాష్ ట్యాగ్ పెట్టింది.
గూడ్స్ రైలు సర్వీసుల రవాణా సమయాన్ని తగ్గించేందుకే ఈ కొత్త ప్రయోగం చేసినట్లు రైల్వే శాఖ వివరించింది. శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా వలసకూలీలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపారు. రైల్వే శాఖ దేశంలో ప్యాసింజర్ రైళ్ల కదలికను పరిమితం చేసినప్పటికీ గూడ్స్ రైలు సేవలు యథాతథంగా నడుస్తున్నాయని వెల్లడించారు.
Taking a big leap in reducing the transit time of freight trains, bilaspur division of SECR broke yet another frontier by joining & running 3 loaded trains (more than 15000 tonnes) in 'Anaconda' formation through bilaspur & Chakradharpur divisions. pic.twitter.com/5lZlQHDpkI
— Ministry of Railways (@RailMinIndia) June 30, 2020