ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. దీని ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను కఠిన తరంగా ప్రభుత్వం మారుస్తూ వస్తుంది. ఇక కరోనా ప్రభావం మళ్లీ ఊపందుకుంది.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే అసలు విషయానికొస్తే .. కరోనా ప్రభావం టీవీ పరిశ్రమపై భారీగా పడిందని చెప్పాలి. 

 


 ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇటీవల ప్రభుత్వ సడలింపులతో షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కాగా.. సీరియల్స్‌తో పాటు ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. అయితే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇద్దరు టీవీ నటులకు కరోనా సోకడంతో పరిశ్రమలో కలకలం రేగింది. ఇక యాంకర్ ఓంకార్‌కి కరోనా అంటూ వార్తలు రాగా.. అవి పుకార్లుగానే తేలాయి.తాజాగా ‘ఆమెకథ’ సీరియల్ నటి నవ్య స్వామి కరోనా వైరస్ బారిన పడినట్టుగా వార్తలు వస్తున్నాయి.
 

 

 

 కరోనా వ్యాధి లక్షణాలతో ఆమె బాధపడుతుందని.. ఆమెకు పాజిటివ్ అని తేలినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ‘ఆమెకథ’, ‘నా పేరు మీనాక్షి’ తదితర పాపులర్ సీరియల్స్‌లో నటించింది. అయితే నవ్య స్వామికి కరోనా పాజిటివ్ అని సీరియల్ యూనిట్ దృవీకరించలేదు.ఇక నవ్య స్వామి నటించిన ఆమె కథ సీరియల్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మహేశ్వరి పాత్రలో అద్బుతంగా ఆకట్టుకుంటుంది నవ్య స్వామి. మైసూర్‌కి చెందిన ఈమె.. ‘నా పేరు మీనాక్షి’ అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత ‘కంటే కూతుర్నే కనాలి’ అనే ఎమోషనల్ డ్రామాలో మనసున్న కూతురిలా నటించి, మెప్పించింది. ఆమె లాక్ డౌన్ తర్వాత వరుస సీరియల్స్ లలో నటించడానికి రెడీ అయింది.. ఇలాంటి సమయంలో ఆమెకు కరోనా అనే వదంతులు వినపడటంతో ఆమె అభిమానులు నిరాశకు లోనయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి: