తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం స్తబ్దు వాతావరణం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనం ఇచ్చిన షాకు నుంచి నేతలు కోలుకునే పరిస్థితి లేదు. కానీ.. కొందరు నాయకులు మాత్రం తమ మార్కు చూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అంటే అంతా వన్ మేన్ షో అన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు లేకపోతే లోకేశ్ అన్నట్టు ఉంటుంది పరిస్థితి.

 

 

కాస్త అప్పుడప్పుడు దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య వంటి నాయకులు తరచూ మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక విమర్శ చేసి వెళ్తుంటారు. అయితే పస లేని విమర్శల వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదన్న సంగతి టీడీపీ కి ఇప్పటికే అర్థం అయ్యింది. కాకపోతే ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి విమర్శించకపోతే ఎలా అన్నట్టు విమర్శలు చేస్తున్నారు.

 

 

ఈ నేపథ్యంలో పట్టాభి అనే తెలుగుదేశం అధికార ప్రతినిధి మాత్రం కాస్త విమర్శలకు పదును పెడుతూ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఈయన చెప్పేదాంటో ఏదో విషయం ఉంది అనిపించేలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చంద్రబాబు దృష్టిలో పడే ప్రయత్నం జోరుగా చేస్తున్నారు. ఈయన దూకుడు చూస్తే త్వరలోనే తెలుగుదేశంలోని కీలక నేతల జాబితాలో చేరేలా కనిపిస్తున్నారు.

 

 

ఇటీవల తెలుగు దేశం నుంచి లంకా దినకర్ వంటి నాయకులు బీజేపీ వైపు వెళ్లిపోయారు. దీంతో కాస్త నోరు చేసుకునే వాళ్ల జోరు తగ్గింది. ఈ పట్టాభి ఆ లోటు పూరిస్తూ.. కాస్త చంద్రబాబు దృష్టిని ఆకర్షించేందుకు తంటాలు పడుతున్నారు. అయితే పస లేని విమర్శలు, నోరు పారేసుకోవడం వంటి పనులతో కాకుండా కాస్త సద్విమర్శలతో.. ఆధారాలతో సహా ప్రభుత్వం తప్పులు ఎండగడితేనే ఉపయోగం ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: