దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే లాక్ డౌన్ సమయంలోను క్రైమ్ రేటు మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు క్రైం బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ దాక క్రైమ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

 

 

దేశంలో ఎదో ఒక్క ప్రాంతంలో రోజుకు ఒక్కరైనా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. మద్యం మత్తులో ఒక్కరైతే.. కామంతో మరొక్కరు ఇలా రోజు రోజుకు అమ్మాయిలపై ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చినవి కొన్ని అయితే వెలుగు చుడనివి మరెన్నో ఉన్నాయి.

 

 

అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కొందరు మగాళ్లు మాత్రం మృగాలుగా మారి ఆడవారి మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో కొందరు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా 14 ఏళ్ల బాలిక తనను ప్రేమించడం లేదని ఆమెపై వేడి నూనెతో దాడి చేశాడు ఓ యువకుడు. పుదుచ్చేరి రాష్ట్రం కిరుమాంబాక్కం ప్రాంతాంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

 

14 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మాదేష్‌ అనే యువకుడు ప్రేమించాడు. బాలిక వెంట పడ్డాడు. ఆమె కూడా తనను ప్రేమించాలని వేధింపులకు దిగాడు. దీనికి ఆ బాలిక అంగీకరించకపోవడంతో గత నెల 18వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ బాలికపై దాడికి పాల్పడ్డాడు. 

 

 

ఆమెపై వేడి నూనె పోశాడు. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక ఫిర్యాదుతో కిరుమాంబాకం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న మాదేష్‌ను మంగళవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: