సినిమాలో పెళ్లి సమయంలో జరిగే సీన్లు భలే అనిపిస్తాయి. అలాంటి సినిమా సన్నివేశాలు నిత్య జీవితలోనూ  జరిగితే ఎలా ఉంటాదో చెప్పలేం. యువకుడు ఒక్క అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య బ్రతికి ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైయ్యాడు. అసలు ఆ పెళ్ళిలో ఎం జరిగింది..? 

 

 

ఓ యువకుడికి పెళ్లి కుదిరింది. పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ముహుర్తం కూడా ముందుకొచ్చింది. దీంతో ధూంధాంగా వధువు ఇంటికి ఊరేగింపుగా బయల్దేరాడు వరుడు. బాజా భజంత్రీలతో అమ్మాయిని పెళ్లాడేందుకు బయల్దేరాడు. ఇంతలో అతడికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది.మొదటి భార్య ఎదురొచ్చి అతడి బండార బయట పడేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మంగళపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్జీకా పూర్వా గ్రామంలో నివసిస్తున్న మన్వేంద్ర సింగ్ యాదవ్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతడు సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2015లో మన్వేంద్ర సింగ్ ఒక యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పరుచుకున్నాడు. వారిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ కలిసి 2018లో ఆర్య సమాజ్‌ లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండ మరో యువతితో మన్వేంద్ర పెళ్లికి సిద్ధమయ్యాడు.

 

 

ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య మన్వేంద్ర పెళ్లి ఊరేగింపులో పోలీసులతో సహా ఎంట్రీ ఇచ్చింది. ఆ యువకుడు తనను ఆర్య సమాజ్ ‌లో వివాహం చేసుకున్నాడని, తనను శారీరకంగా వేధింపులకు గురిచేశాడని, గర్భస్రావం కూడా చేయించాడని ఆమె ఆరోపించారు.

 

 

మొదటి భార్య ఉండగా, రెండవ పెళ్లి ఎలా చేసుకుంటాడని మన్వేంద్రను నిలదీసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పెళ్లి ఊరేగింపు ఆగిపోగా, పెళ్లికి వచ్చినవారంతా ఈ ఘటనతో విస్తుపోయారు. పోలీసులు అతడిని తీసుకెళ్లడంతో షాక్ తిన్న వధువు కుటుంబ సభ్యులు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: