అసలు ఏమైందో తెలియదు గానీ ఢిల్లీలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిజంగా వారు ప్రమాదానికి గురయ్యారా లేకపోతే ఆత్మహత్యకు పాల్పడ్డారో అర్థం అవ్వట్లేదు. కానీ గురువారం ఉదయం పూట వారు రైలు పట్టాలపై మృతదేహాలు పడి ఉన్నాయి. ఇక అక్కడ మృతదేహాల తోపాటు పక్కనే మరో బాలుడు ఏడుస్తూ కనిపించాడు.

IHG'ਤੇ ਮਿਲੀਆਂ ਤਿੰਨ ਦੋਸਤਾਂ ...

 


తూర్పు ఢిల్లీలో ఉన్న మండవల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ హృదయ విదారక దృశ్యం బయటపడింది. ఇక అక్కడి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

IHG

 

రైలు పట్టాల పక్కన ఉన్న బాలుడు ని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ పట్టాలపై ఉన్న మృత దేహాలను పోస్టుమార్టానికి పోలీసులు పంపించడం జరిగింది. 

IHG


ఇకపోతే మృతులు మండవల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే కాలనీ కి చెందిన కిరణ్, తన ఇద్దరు పిల్లలు గా పోలీసులు వారిని గుర్తించారు. అయితే అక్కడ పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన పోలీసులు ఆ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు కనబడుతుందని నిర్ధారణకు వచ్చారు. అయితే తర్వాత కచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలియజేశారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉపాధి కోల్పోవడంతో ఏమి చేయాలో తోచక ఇలాంటి ఆత్మహత్యలకు కుటుంబ మొత్తం పాల్పడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: