చంద్రబాబు హయాంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ESI కుంభకోణంలో అచ్చెన్నాయుడు 150 కోట్ల మేరకు అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకోవటం అంతా తెలిసిందే. కాగా అచ్చెన్నాయుడు అరెస్ట్ ముందు పైల్స్ ఆపరేషన్ జరిగిన తరుణంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రజెంట్ బాగోలేదని గుంటూరు జిజిహెచ్ లో చికిత్స చేయించి తిరిగి మళ్లీ ఆరోగ్యం కుదుటపడ్డాక జైలుకు తీసుకు వెళ్లడం జరిగింది. దీంతో అచ్చెన్నాయుడు ఆరోగ్యంతో ఏపీ ప్రభుత్వం ఆడుకుంటోందని జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. 16 నెలలు జగన్ జైలులో ఉండటంతో మిగతా నాయకులు కూడా తన లాగే జైలు జీవితం గడపాలని జగన్ ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ మండిపడుతున్నారు.

 

ముఖ్యంగా జగన్ ఎర్రన్నాయుడు కుటుంబాన్ని గట్టిగా టార్గెట్ చేశారని అందుకే అచ్చెన్నాయుడు ని అనేక రీతులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అచ్చెన్నాయుడు కుటుంబాన్ని ఇటీవల నారా లోకేష్ పరామర్శించడం జరిగింది. రాజకీయాలలో అచ్చెన్నాయుడు బాహుబలి లాంటి వాడిని జగన్ కాలకేయుడు వైసిపి నాయకులంతా కాలకేయ బ్యాచ్ అని విమర్శలు చేయడం జరిగింది. దీంతో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి పార్టీ మద్దతుదారులు సెటైర్లు వేస్తున్నారు. ఏపీ ప్రజలు వైఎస్ జగన్ లో బాహుబలి చూశారు కాబట్టి 'మాహిష్మతి సింహాసనం' లాంటి సీఎం కుర్చీని జగన్ కి కట్టబెట్టారు. మీ తండ్రి చంద్రబాబు అసలైన కాలకేయుడు తప్పుడు హామీలు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు కాబట్టి ఇంటికి పంపించారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

ఈఎస్ఐ కుంభకోణం లో అరెస్టైన అచ్చెన్నాయుడు కట్టప్ప లాంటివాడిని..ప్రస్తుతం జరుగుతున్న విచారణలో నీ పేరు గాని నీ తండ్రి పేరు గాని బయటకు చెబితే స్క్రీన్ పై కట్టప్ప కత్తి బాహుబలి కి ఎలా దిగిందో....అదే రీతిలో అచ్చెన్నాయుడు నోరు విప్పితే మీకు దిగిపోతుంది అంటూ కౌంటర్లు వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: