దేశ ప్రధాని మోడీ చైనాతో ఎక్కడా తగ్గడం లేదు. డి అంటే డి అనే విధంగా దూసుకుపోతున్నారు. తాజాగా లడక్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న దేశ సైనికులు దగ్గరకు ఆకస్మికంగా పర్యటించిన మోడీ సైనిక ఉన్నత అధికారులతో సమావేశమై అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. కాగా ఈ పర్యటన మోడీ షెడ్యూల్లో లేదట. ఎవరికీ తెలియకుండా ఆఖరికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి కూడా మోడీ ఇలా సైనికుల దగ్గరకు వస్తారని తెలియదట. ఆ విధంగా చాలా రహస్యంగా మోడీ ఈ పర్యటన చేయటంతో చైనాతో యుద్ధం విషయంలో చాలా సీరియస్ గా మోడీ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ విధంగా ప్రధాని మోడీ పర్యటన తెలుసుకుని శత్రుదేశం చైనా కూడా ఒక్కసారిగా షాక్ తిన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న సైనికులతో ప్రత్యేకంగా సమావేశమైన మోడీ వారిని ఉద్దేశించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ బూస్ట్ ఇచ్చే విధంగా ప్రసంగించడం జరిగింది. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవాలి అని ఎక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మీ వెనకాల దేశం ఉన్నది అంటూ మోడీ ప్రసంగం చేశారట. అంతేకాకుండా లడక్ ప్రాంతంలో గాయపడిన సైనికులను ప్రత్యేకం మోడీ పలకరించడం జరిగింది. కరోనా వైరస్ లాంటి కష్టకాలంలో కూడా మీరు దేశం కోసం పనిచేస్తున్నారు హాట్స్ ఆఫ్ అని సైనికులకు మోడీ వందనాలు తెలిపారు.

 

అదేవిధంగా దేశం కోసం మీరు చూపిస్తున్న ధైర్యసాహసాలను ఎవరి మర్చిపోరు అని చరిత్రలో నిలిచిపోతుందని సైనికులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అంతేకాకుండా దేశమంత మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతోంది అని మోడీ పేర్కొన్నారు. ప్రపంచం నలు వైపులా మీరు ఇటీవల ఈ ప్రాంతంలో చూపిన ధైర్యం సాహసం గట్టి సందేశాన్ని శత్రు దేశాలకు పంపించిందని మోడీ చెప్పుకొచ్చారు. లడక్ నుంచి కార్గిల్ వరకు మీరు చూపిస్తున్న ధైర్యసాహసాలు అమోఘమని సైనికులను కొనియాడారు. మొత్తానికి మోడీ తన పర్యటనలో భారత సైనికులకు అదిరిపోయే బూస్ట్ ఇచ్చే విధంగా ప్రసంగం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: