విజయవాడ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ ఎంపీ కేశినేని నానీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆయన చాలా వరకు బలమైన నేత అనే సంగతి అందరికి తెలిసిందే. టీడీపీతో సంబంధం లేకుండానే ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ ఉంది. అందుకే మొన్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోయినా సరే విజయవాడ లోక్సభ సీటు నుంచి ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు. మరో విశేషం ఏంటంటే ఈ లోక్సఢ సీటు పరిధిలో ఒక్క విజయవాడ తూర్పులో మాత్రమే టీడీపీ గెలిచి.. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ వైసీపీ గెలిచినా కూడా ఎంపీగా నాని విజయం సాధించి ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఏంటో నిరూపించుకున్నారు.
ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాని రాజకీయంగా, ఆర్ధికంగా కూడా తిరుగులేని నేతగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి నేతను పార్టీలో సీనియర్ గా చెప్పే దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అసలు పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏ మాత్రం పొసిగేది కాదు. విజయవాడ మేయర్ సీటు విషయంలో ఆయన తన కుమార్తెను నిలబెట్టడం పై దేవినేని ఉమా సైలెంట్ గా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ని దువ్వుతున్నారు అని పార్టీ పరిశీలకులు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో కేసినేని శ్వేత పోటీ చేయడంపై దేవినేని ఉమా ఇబ్బందులు సృష్టిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకుని వెళ్ళారు అని టాక్.
తాజాగా టీడీపీ సీనియర్ నేతలు కొందరు ఉమాను కలవగా జలీల్ ఖాన్ కుమార్తె లేదా గద్దె అనురాధ ను నిలబెడితే ఈజీగా విజయవాడ సీటుని గెలుస్తారని... కేశినేని శ్వేత కు ఆ ఇమేజ్ లేదు అని, రేపు మీకు ఇబ్బంది కావొచ్చు అని ఆయన వారికీ సూచనలు చేసారట. దీనితో ఇప్పుడు కేశినేని ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారాన్ని బయటపెట్టే అవకాశం ఉందని అదే జరిగితే మాత్రం విజయవాడ రాజకీయాల్లో సంచలనమే అంటున్నారు. అసలే ఉమా వర్సెస్ కేశినేని మధ్య ఉప్పు నిప్పుగా వాతావరణం ఉంది. ఈ టైంలో కేశినేని కుమార్తెకు మేయర్ పదవి వస్తే నగర రాజకీయాల్లో తన పట్టు ఉండదనే ఉమా అడ్డు పుల్లలు వేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది.