మీరు మీ డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా....?  లేదా రాబడి పొందాలని భావిస్తున్నారా....?  రిస్క్ లేకుండా మీరు లాభాలని ఆశిస్తున్నారా.....? అయితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్  తో కళ్ళు చెదిరే రాబడిని మీరు పొందవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ లో ఏ రిస్క్ లేకుండా మీరే డిపాజిట్ చేసి లాభాలని పొందాలని అనుకుంటున్నారా...?  అయితే ఇందులో మీకు చాలా ఆప్షన్లు ఉన్నాయి.

 

ప్రస్తుతం కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు లో ఈక్విటీ మార్కెట్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఎన్నోరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పటికీ కొంత రిస్క్ ఎప్పుడో ఒకప్పుడు మనం వింటున్నాము. కానీ ఏ రిస్కు లేకుండా మీరు డబ్బులని పెట్టి లాభాలని  పొందాలనుకుంటే కచ్చితంగా ఇది మీరు ఫాలో అవ్వాల్సిందే..

 


రిస్క్ లేకుండా రాబడి పొందాలంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో డిపాజిట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తుంది. వీటిలో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒక అద్భుతమైన స్కీమ్ అని చెప్పాలి. ఈ పథకంలో డబ్బులు పెడితే రెట్టింపు రాబడి పొందొచ్చు. ఒకవేళ మీరు పది వేలు పెడితే అది 20 వేలు అవుతుంది లక్ష రూపాయలు పెడితే అది రెండు లక్షలు అవుతుంది అదే మీరు ఐదు లక్షలు పెడితే అది పది లక్షలు అవుతుంది. ఈ కిసాన్ వికాస్ పత్రం కి ఎలాంటి భయం ఉండదు. 

 


ఖచ్చితమైన రాబడి మీకు వస్తుంది అయితే ఈ స్కీం వివరాల్లోకి వెళితే  మెచ్యూరిటీ గడువు 124 నెలలు అంటే ఈ కాలంలో మీ డబ్బు రెట్టింపవుతుంది. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు. అయితే ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది.  దీనిలో నామినేషన్ కూడా పెట్టుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. అందువల్ల మీరు భయపడకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.

 

 

కిసాన్ వికాస్ పత్రం స్కీం పై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది ఇలా సమీక్షించి వాటిలో కొన్ని మార్పులు చేస్తుంది దీనితో వడ్డీ రేట్లు పెరగొచ్చు తగ్గచ్చు లేకపోతే ఇలానే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: