భారత్-చైనా సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్-చైనా సరిహద్దు లో ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓవైపు ఇరుదేశాల సైనిక దళాలు భారీ ఎత్తున మోహరించడం.. యుద్ధం తప్పదు అనే సంకేతం ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్న రీతిలో అందరికీ హాట్ హాట్ గా మారింది. భారత్ కోరని యుద్ధాన్ని భారత్ తో చేయించేందుకు చైనా కదులుతుంది. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుందో అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
భారత్లో తమ అధీనంలోకి తీసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తోంది చైనా.భారత్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఆసియా ఖండంలో చైనా కు మించిన బలమైన దేశం లేదు అంటూ నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో భారత్ మాత్రం వెనకడుగు వేయకుండా చైనా ఎత్తుకి పైఎత్తు వేస్తూ చైనా కు దీటుగానే బదులిస్తుంది భారత్. అయితే ఇప్పటికే చైనాకు భారత్ కి మధ్య శారీరక యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ప్రస్తుతం చైనా మానసిక యుద్ధం చేస్తుంది భారత్ పైన. భారత సైనికులను మానసికంగా కుంగదీసేందుకు ప్రస్తుతం చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే చైనాకు సరిగ్గా బుద్ది చెప్పేందుకు ఆయుధాలను వేగంగా కొంటుంది భారత్. రష్యా ఫ్రాన్స్ నుంచి సరికొత్త ఎంతో పవర్ఫుల్ ఆయుధాలు ఇండియాకి చేరుకుంటున్నాయి. తాజాగా ఇప్పటికే 715 ఎమ్కే48 లైట్ వెయిట్ మిషన్.. 1050 ఎఫ్ఎన్ స్కార్ హెచ్, 14 వందల సంఖ్యలో ఎఫ్ఎన్ స్కార్ ఎల్ లాంటి పలు రకాల ఆయుధాలను అత్యవసర ఆర్డర్ ఇచ్చింది భారత్. ఈ ఆయుధాలను అమెరికా ఇజ్రాయెల్ నుంచి వస్తున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు.