మనిషిలో మానవత్వం రోజు రోజుకు కనుమరుగు అవుతుంది అనడానికి ఈ ఘటన నిదర్శనం. దేవుడి తర్వాత దేవుడితో సమానంగా చేసే డాక్టర్స్ ని కొలుస్తాము. అలాంటి వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే...? వారి నిర్లక్ష్యానికి ఒక్క నిండు ప్రాణం బలైతే..? ఇలా అనేక అనుమానాలకు దారి తీసేలా ఉంది ఈ ఘటన.ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించే హృద‌య‌విదార‌క ఘ‌ట‌న ఇది‌. ఓ త‌ల్లి అనారోగ్యానికి గురైంది. కొడుకు ఆమెను  ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. కానీ అక్క‌డ డాక్టర్స్ ఎవ‌రూ కనపడలేదు. ఇక్క‌డ ఎవ‌రైనా ఉన్నారా? అని నోరు పోయేలా మొత్తుకున్న ఎవ‌రూ స్పందించ‌లేదు. చివ‌ర‌కు కుమారుడి క‌ళ్లెదుటే క‌న్న త‌ల్లి ప్రాణాలను విడిచింది. దాంతో త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద కుమారుడు గుండెల‌విసేలా రోదించాడు. ఈ ఘటన లక్నోలో చోటు చేసుకుంది. 

 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాజధాని అయినా లక్నో పరిధిలోని హ‌ర్దోయి జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి.. అనారోగ్యానికి గురైన త‌న త‌ల్లిని తీసుకుని స‌వాయిజౌర్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ కు తీసుకెళ్లాడు. అక్క‌డ ఆస్ప‌త్రి త‌లుపులు మూసి ఉండ‌టంతో.. ఫ్లోర్ పై త‌ల్లిని ప‌డుకోబెట్టాడు. కాపాడండి అంటూ త‌లుపులు కొట్టాడు. ఇక్క‌డ ఎవ‌రైనా ఉన్నారా అంటూ.. అటు ఇటు తిరిగాడు. చివ‌ర‌కు కిటికీ అద్దాల‌పై చేయితో బాది.. ఆదుకోండి అంటూ అరిచాడు. ఎవ‌రూ స్పందించ‌లేదు. అప్ప‌టికే త‌ల్లి ప్రాణాలు కోల్పోయిందన్నారు. త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద కుమారుడు కంట‌త‌డి పెట్టిన తీరు అంద‌రి మ‌న‌సుల‌ను క‌లిచివేస్తోందన్నారు. 

 

 


ఈ ఘ‌ట‌న‌పై ఆస్ప‌త్రి వ‌ర్గాలు స్పందించాయి. స‌రైన గేటు నుంచి అత‌ను ఆమెను ఆస్ప‌త్రికి తీసుకురాలేదు అని తెలిపారు. దీని వ‌ల్ల సిబ్బంది.. వారిని గ‌మ‌నించ‌లేదు. స‌కాలంలో వైద్యం చేయ‌లేక‌పోయారు. ఆస్ప‌త్రి కార్య‌క‌లాపాలు ముగిసిన త‌ర్వాత ప్ర‌ధాన గేటును మూసివేశామ‌న్నారు. గ‌ర్భిణీలు, అత్య‌వ‌స‌ర రోగుల‌కు వెనుక గేటు ఉప‌యోగిస్తున్నామ‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు పేర్కొన్నాయని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: