డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. ఎప్పుడూ కాంట్రావర్సీల చుట్టూ సినిమా కథలు అల్లి.. సొమ్ము చేసుకునే రామ్ గోపాల్ వర్మ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యను కూడా సినిమా రూపొందించాలనుకుంటున్నాడు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫాదర్స్ డే రోజు రిలీజే చేశారు. దీనిపై అప్పుడే అమృత గట్టిగా ఆర్జీవికి కౌంటర్ ఇచ్చేసింది.

 

 

అయితే.. అమృత కౌంటర్ ఇచ్చినా.. వర్మ మాత్రం ఆగలేదు.. అయితే ఇప్పుడు వర్మకు అమృత మామయ్య, ప్రణయ్ తండ్రి బాలస్వామి ఊహించని షాక్ ఇచ్చారు. వర్మ తీయబోతున్న మర్డర్ సినిమా తమ హక్కులకు భంగం కలిగిస్తోందంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ తీయబోయే మర్డర్ సినిమా ప్రణయ్ హత్య కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని బాలస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 

 

ఈ పిటిషన్ ను పరిశీలించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు రామ్ గోపాల్ వర్మపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో రామ్ గోపాల్ వర్మ మర్డర్ ఇష్యూ మరో మలుపు తిరిగినట్టయింది.

 

 

అయితే.. ఎప్పుడూ కాంట్రావర్సీలతోనే నెట్టుకొచ్చే రామ్ గోపాల్ వర్మకు ఇలాంటి కేసులు, నోటీసులు కొత్త కాదు.. కానీ.. ఇది మిగిలిన కోర్టుల్లాంటి కోర్టు కాదు.. ఎస్సీ, ఎస్టీ కేసు అంటే కేసు చాలా బలంగా ఉంటుంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయి.. వర్మ ఇకనైనా తన మర్డర్ సినిమా ఆలోచన మానుకుంటాడా.. లేక.. ముందుకే వెళ్తాడా అన్నది చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: