ఈ నెల 7వ తారీకు మరియు 8 వ తారీకు లో వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి కిరణ్ మరియు ఎస్ పి సీఎం పర్యటన విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జగన్ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ట్రిపుల్ ఐటీ, ఆర్కే వ్యాలీ లో వైయస్ జగన్ పాల్గొనే కార్యక్రమాలను విజయవంతం చేయడానికి జిల్లా నేతలు కూడా రెడీ అవుతున్నారు.

IHG

ముఖ్యంగా జూలై 8 వ తారీఖున వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా...తన తండ్రి పుట్టిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు గుర్తు ఉండిపోవాలని ఆ రోజే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జగన్ చేయాలని డిసైడ్ అయినట్లు....అందుకోసం ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు వైసీపీ పార్టీ నేతలు భారీ స్థాయిలో కన్నుల పండుగగా చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

IHG

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టాలనే దిశగా జగన్ ఉండటంతో అదేరీతిలో తన తండ్రి పుట్టిన రోజు వేడుకలను కూడా ఆ రీతిలోనే జరిగేలా పక్కా ప్లానింగ్ తో ఈ కార్యక్రమం వైసీపీ హైకమాండ్ చేస్తుందని సమాచారం. రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఇళ్ల పట్టాల కార్యక్రమాల విషయంలో వివిధ జిల్లాలకు చెందిన వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: