కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మయిల భద్రత కోసం ఎన్ని చట్టాలను తీసుకొచ్చిన అమ్మాయిలకు మాత్రం రక్షణ లేకుండా పోతుంది. దేశంలో ఎదో ఒక్క ప్రాంతంలో ఉన్నత స్థాయి నుండి దిగువ స్థాయి మహిళల వరకు రక్షణ లేక ఎవరో ఒక్కరి చేతులో మోస పోతూనే ఉన్నారు. అనేక కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన నటిపై కార్పోరేట్ కంపెనీ సీఈవో ఒకరు అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.

 


వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని జేజే నగర్‌ పరిధిలో ఉంటున్న ఓ మహిళ(30) తమిళ, కన్నడ భాషల్లోని అనేక సినిమాల్లో నటించారు. 2018లో బసవనగుడి పరిధి గాంధీ బజార్‌ ప్రాంతానికి చెందిన మోహిత్‌ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తాను ఓ కార్పరేట్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నానని చెప్పి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు.

 

 

కొద్దిరోజులకు ఆమెను తన కంపెనీకి అంబాసిడర్‌గా నియమించాడు. ఈ క్రమంలోనే కంపెనీ ప్రచారం నిమిత్తం ఆమెను గోవా వంటి పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లాడు. 2019 జూన్‌ 22న పుట్టినరోజు పేరుతో మోహిత్ తన ఇంట్లోనే పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాతి రోజే ఆమె పుట్టినరోజు కావడంతో ఇద్దరూ కలిసి ఏకాంతంగా పార్టీ చేసుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మోహిత్ కూల్‌ డ్రింక్‌ లో మత్తు మందు కలిపి ఆమెతో తాగించాడు.

 

 

మత్తులోకి జారుకున్న ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ తతంగాన్నంతా సెల్‌ ఫోన్లో వీడియో తీశాడు. వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తూ పలు విడతలుగా సుమారు రూ.20లక్షల వరకు దోచుకున్నాడు. దీంతో దీంతో విసిగిపోయిన బాధితురాలు మోహిత్‌తో పాటు అతడి తల్లిదండ్రులు మహాదేవ్, నాగవేణితో పాటు బంధువు రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మోహిత్‌ కోసం గాలిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులను త్వరలోనే విచారిస్తామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: