దేశ ప్రజలకు మరోసారి గుడ్ న్యూస్ అందించనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపికబురు అందించడానికి సిద్ధమౌతోందని సమాచారం. గ్యాస్ మార్కెటింగ్‌ విధానంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు రెడీ అవుతోందని తెలిపారు. దీంతో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వారికి ప్రయోజనం కలుగనుందన్నారు. సంస్కరణలపై ఇప్పటికే పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమీక్ష కూడా నిర్వహించిందని అధికారులు వెల్లడించారు.

 

 

ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా ఎల్‌పీజీని కొనుగోలు చేయవచ్చునన్నారు. 14 కేజీల సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సిన పని లేదన్నారు. దీంతో సిలిండర్ పూర్తి ధరను చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతుందన్నారు. మొబైల్ ఎల్‌పీజీ వ్యాన్ల ద్వారా గ్యాస్‌ను ఇంటి వద్దకు సరఫరా చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. 

 

 

అలాగే మీరు తీసుకున్న గ్యాస్‌కు అనుగుణంగానే సబ్సిడీ ధర కూడా వస్తుందన్నారు. అంటే మీరు సిలిండర్‌కు రూ.650 చెల్లించకుండా మీకు నచ్చినంత ఎల్‌పీజీని సిలిండర్‌కు పట్టించుకోవచ్చునని తెలిపారు. అయితే మీరు రూ.80 - రూ.100కు కూడా గ్యాస్ కొనొచ్చునన్నారు. అలాగే మీరు కొనుగోలు చేసిన ఎల్‌పీజీకి అనుగుణంగానే మీకు వచ్చే సబ్సిడీ మొత్తం కూడా నిర్ణయమౌతుందని తెలియజేశారు.

 

 

ఇలాంటి రూల్ అమలులోకి వస్తే.. వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చునన్నారు. మన వద్ద ఎంత డబ్బు ఉంటే అంతకే గ్యాస్ కొనుగోలు చేయడం సాధ్యమౌతుందని తెలియజేశారు. కాగా ఒకటో తేదీ నుంచి సిలిండర్ ధర పెరిగిన విషయం విదితమే. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.4.5 వరకు పెరిగిందన్నారు. ప్రభుత్వ రంగ oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. 14.2 కేజీల సిలిండర్‌కు ఇది వర్తిస్తుందని తెలియజేశారు. అయితే గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం అని యాజమాన్యం పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: