మీరు మీ డబ్బులు రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా..?  కేవలం రూపాయలు 1000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. అదిరి పోయింది కదా ఈ బంపర్ ఆఫర్. మరి ఆలస్యం చేయకండి. ఈ స్కీం వివరాలు పూర్తిగా చూసి ఏ రిస్క్ లేకుండా రాబడి పొందండి. మీ చేతిలో ఉన్న డబ్బు మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చు. రేపటి భవిష్యత్తు లో మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండగలరు. ఇది సరైన సమయం.

 

ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ మీరు ఎక్కువ రాబడి పొందండి. బ్యాంకులో డబ్బు దాచుకోవడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ మంది చేస్తారు. అయితే దీనిలో తక్కువ రాబడి ఎక్కువ రిస్కు ఉంటుంది. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొత్త స్కీమ్ మీరు తీసుకోవచ్చు. ఇది నిజంగా మీకు ఎక్కువ రాబడిని అందిస్తుంది. భారత్ బాండ్ ఈటిఎఫ్  దీని రెండో విడత సబ్స్క్రిప్షన్ ప్రారంభం ఇప్పుడే కానుంది. జూలై 14 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈసారి రూపాయలు 14 వేల కోట్లు సమీకరించాలని యోచిస్తోంది.

 

భారత్ బాండ్ ఈటీఎఫ్ సబ్‌స్క్రిప్షన్ జూలై 17న ముగుస్తుంది . అయితే దీనిలో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం రూ 1000 ఉన్నా సరి పోతుంది మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. కేవలం అది 0.008 శాతం మాత్రమే. దీని వల్ల మీరు  స్థిరమైన రాబడి పొందవచ్చు. మీరు కనుక దీనిలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది అంటే ఇక్కడ 7.5 శాతం రాబడిని పరిగణ లోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ చేతిలో ఉన్న డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేసి  ఈ కొత్త స్కీం వినియోగించుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: