తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తుంది. ఒకవైపు కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనకు గురి అవుతూ ఉంటే... మరోవైపు మహిళలపై, మైనర్ బాలికలపై  అఘాయిత్యాలకు కామందులు పాల్పడుతున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణమైన సంఘటన వనస్థలిపురం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... వనస్థలిపురంలో ఒక మహిళ, తన ఇద్దరి పిల్లలతో కలిసి భర్తకు దూరంగా జీవనం కొనసాగిస్తుంది. కుటుంబంలో జరిగిన గొడవల వల్ల భార్య భర్తలు ఐదు సంవత్సరాల కిందట విడిపోయారు. 

 

IHG

 

ఇది ఇలా ఉండగా ఒక సంవత్సరం నుంచి ఇబ్రహీంపట్నం కు చెందిన నరసింహ యాదవ్ అనే వ్యక్తి ఆ మహిళ కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు. ఈ తరుణంలోనే నరసింహ యాదవ్ ఆ మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాడు. అలాగే వారం రోజులలో మూడు సార్లు మహిళ ఇంటికి వచ్చేవాడు. అయితే ఆ మహిళ గత కొన్ని రోజులుగా తన మైనర్ కుమార్తెను చాలా బలహీనంగా, నీరసంగా ఉండడం గమనించింది. దీనితో ఏమయింది అని కూతుర్ని ప్రశ్నించగా... ఆ బాలిక తన పై జరిగిన అఘాయిత్యాన్ని తన తల్లికి తెలియజేసింది. దింతో ఈ విషయాన్ని బయటకు తెలియజేస్తే తనని చంపేస్తానని నరసింహ తనను బెదిరించాడని ఆ మహిళకు తెలియజేసింది. 

 


ఇక అక్కడితో ఆ మహిళ నరసింహ యాదవ్ పై దగ్గరలోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు పెట్టింది నరసింహ పై కేసు పెట్టింది. ఇక పోలీసు అధికారులు తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న నరసింహ యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: