ఈ ఘటనతో మహిళలకు రక్షణ అనేది కరువైంది అన్నది మరో సారి నిరూపితమైంది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలోని కొట్టాలపల్లి వద్ద ఓ యువకుడితో యువతి మాట్లాడుతున్న సమయంలో రాజశేఖర్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లాడు. దీంతో సదరు యువతిని బెదిరించిన ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్ళాడు. అయితే ఈ క్రమంలోనే కీచక ఆలోచన చేసి కామాంధుడిగా మారిపోయాడు. యువతిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లకుండా కోవూరులోని తాను ఉంటున్న గది కి తీసుకెళ్లాడు. ఇక ఆ యువతి ఎంత వేడుకొన్నప్పటికీ బలవంతంగా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ సురేంద్ర నాథ్ కు ఫోన్ చేసి తనకు గదికి రమ్మని చెప్పాడు.
అనంతరం ఏఆర్ కానిస్టేబుల్ కూడా సదరు యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఆ తర్వాత ఆ యువతి ని వదిలిపెట్ట గా అతని స్నేహితుడు యువతి ప్రవర్తన చూసి అనుమానం వచ్చి 100కు ఫోన్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కానిస్టేబుల్ ను అరెస్టు చేశారు. అయితే జిల్లాలో జరుగుతున్న ఇలాంటి ఘటన పై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Powered by Froala Editor