యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు లోని జయమ్మ, రాజా రెడ్డి దంపతులకు 1949 జూలై 8 వ తేదీన సి.ఎస్.ఐ. కాంప్బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. తండ్రి రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టర్ గా పని చేస్తుండేవారు. దీంతో రాజశేఖరరెడ్డి ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు బళ్లారి లోని సెయింట్ జాన్స్ స్కూల్ లో చదువుకున్నారు. తన ఇంటర్మీడియట్ విద్యను విజయవాడలోని లయోలా కాలేజీలో పూర్తి చేశారు. తదనంతరం తన 23వ యేటా గుల్బర్గా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను పూర్తి చేశారు.
గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే అతను విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పుడే తనలో గొప్ప నాయకుడు ఉండని ఆ కళాశాల విద్యార్థులకు బాగా అర్థమైపోయింది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యాభ్యాసం చేసి హౌస్ సర్జన్ పట్టాను పొందారు. వైయస్సార్ ఒక వైపు లీడర్ గా కొనసాగుతూనే మరో వైపు చదువుల్లో రాణించేవారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ గా బాధ్యతలు చేపడుతూ హౌస్ సర్జన్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. చదువుకుంటున్న రోజుల్లోనే వైయస్సార్ రాజకీయం వైపు బాగా ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేసి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి చరిత్ర సృష్టించారు.
Powered by Froala Editor